Monday, May 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan bus yatra @ 19th day: గొడిచర్ల నుంచి 19వ రోజు బస్...

Jagan bus yatra @ 19th day: గొడిచర్ల నుంచి 19వ రోజు బస్ యాత్ర స్టార్ట్

అనకాపల్లి జిల్లా గొడిచర్ల నైట్ స్టే పాయింట్ నుంచి ప్రారంభమైన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ 19వ రోజు బస్సుయాత్ర. అనకాపల్లి జిల్లా గొడిచర్ల నైట్‌ స్టే పాయింట్ వద్ద అమలాపురం జనసేన పార్టీ నుంచి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు సీనియర్ నేతలు. జనసేన నుంచి చేరిన నేతలకు కండువాలు వేసి వైయస్సార్సీపీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి. జనసేన నుంచి వైయస్సార్సీపీలో చేరిన అమలాపురం జనసేన సీనియర్ నేత, ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్, డీ ఎం ఆర్ శేఖర్‌, దుర్గాభవాని, 2019లో జనసేన పార్టీ తరపున అమలాపురం ఎంపీగా పోటీ చేసిన డీఎంఆర్ శేఖర్.

- Advertisement -

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం గొడిచర్ల నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్‌. జగన్‌ను కలిసిన పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం నియోజకవర్గాలకు చెందిన వైయస్సార్సీపీ నేతలు. పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి వైయస్‌.జగన్.

అనంతరం బస్సు యాత్ర ప్రారంభం కాగా.. అభిమాన నాయకుడి కోసం బస్సుకు ఎదురేగి స్వాగతం పలికిన మహిళలు. బస్సుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News