Thursday, June 5, 2025
Homeఆంధ్రప్రదేశ్తెనాలి ఘటనపై వైఎస్ జనగ్ ఫైర్.. చంద్రబాబుని కూడా ఇలాగే శిక్షిస్తారా..?

తెనాలి ఘటనపై వైఎస్ జనగ్ ఫైర్.. చంద్రబాబుని కూడా ఇలాగే శిక్షిస్తారా..?

తెనాలిలో పోలీసులు కొట్టిన యువకుల కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన… ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావట్లేదని.. దానికి బదులుగా రెడ్ బుక్ రాజ్యాంగమే అమలవుతోందని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా రాజకీయనాయకులకు దాసులుగా అయిపోతున్నారని.. తమకు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -

తెనాలి పోలీస్ స్టేషన్ పరిధిలో రాకేశ్, విక్టర్, కరీముల్లా అనే ముగ్గురు యువకులు సామాన్య వెనుకబడిన వర్గాలకు చెందిన వారు. రాకేశ్ హైదరాబాద్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నప్పటికీ, తెనాలికి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన సమయంలోనే అతనిపై పాత కేసు ఉద్దేశిస్తూ కస్టడీలోకి తీసుకున్నారు. అతనితో పాటు ఉన్న స్నేహితులపై కూడా అదే తరహాలో కేసులు బనాయించారని ఆరోపించారు. ఐతా నగర్‌లో సివిల్ డ్రస్‌లో ఉన్న కానిస్టేబుల్ చిరంజీవిని ప్రశ్నించడమే నేరంగా మారిందని అన్నారు. కారణం లేకుండా పోలీసులు యువకులను రోడ్డుపైనే కొట్టారన్నారు. వారి కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. అప్పట్లో దీన్ని ఎవ్వరూ గమనించకపోయినా, నెల రోజుల తర్వాత వీడియో బయటకు వచ్చింది.

విక్టర్ ఒక జూనియర్ న్యాయవాది కాగా, అతని నాన్న ఒకకాలంలో ప్రజాశక్తిలో విలేఖరిగా పనిచేశారు. అయినా, పోలీస్ వ్యవస్థ నుండి కనీస న్యాయం కలగలేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. యువకుల జేబుల్లో కత్తులు పెట్టి, మారణాయుధాలు కలిగినట్టు చూపుతూ కేసులు పెట్టారన్న ఆరోపణలు తాలూకు ఆధారాలతోనే స్పష్టమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, న్యాయమంటే ఏమిటో మర్చిపోయిందని జగన్ విమర్శించారు. ”నేరం జరిగినా జరగకపోయినా విచారణ చేయాల్సింది న్యాయస్థానమే. పోలీసులకు నేర నిర్ణయం తీసుకునే హక్కు లేదు,” అని స్పష్టం చేశారు. ”రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై 24 కేసులున్నాయి. ఆయనను కూడా ఇదే లాజిక్ ప్రకారం నడిరోడ్డుపైనే కొట్టాలా?” అని జగన్ వ్యంగ్యంగా ప్రశ్నించారు.

దాచేపల్లి, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో పోలీసుల తీరుపై గతంలోనూ ఆరోపణలున్నాయని గుర్తు చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని అభిప్రాయపడ్డారు. దీనికి నిరసనగా జూన్ 4న “వెనుకబడిన వర్గాల వెన్నుపోటు దినోత్సవం” నిర్వహించనున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News