Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kautalam TDP: ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు

Kautalam TDP: ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు

నిరసనలకు దిగిన కౌతాళం టీడీపీ శ్రేణులు

ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడుని అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చెయ్యడం చాలా దారుణమని, ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు అని తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి అన్నారు… పార్టీ పిలుపు మేరకు కౌతాళంలో నిరసన ర్యాలీ చేపట్టారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక ఆసహనంతో ఈ విధంగా అరెస్ట్ చెయ్యడం పిరికిపంద చర్య. ఎవరెన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కడిగిన ముత్యంలా అక్రమ అరెస్టును చేదించుకొని వస్తారని అన్నారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వం తెలుగు ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పి, చంద్రబాబు ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -


ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నబసప, వెంకటపతి రాజు, అడివప్ప గౌడ్, టిప్పు సుల్తాన్, కురుగోడు, రమేష్ గౌడ్, శివప్ప గౌడ్, వెంకట్ రెడ్డి, ఎరిగేరి బసవరాజు, బదినే హాలు నరసింహులు, వీరేష్, రాజానందు తదితరులు పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News