Saturday, July 27, 2024
Homeఆంధ్రప్రదేశ్Madakasira: మడకశిర టిడిపి ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెస్ రాజుకు

Madakasira: మడకశిర టిడిపి ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెస్ రాజుకు

విధ్వంసం సృష్టించిన సునీల్ వర్గం..

మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ కు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నెలరోజుల కిందట మడకశిర నియోజవర్గ టిడిపి ఎమ్మెల్యే టికెట్ డాక్టర్ సునీల్ కుమార్ ఇస్తున్నానని మీడియా ద్వారా వెల్లడించారు. నెల రోజుల నుంచి మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ మడకశిర నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ, టిడిపి మేనిఫెస్టో గురించి వివరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత మూడు రోజుల నుంచి టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజుకు మడకశిర ఎమ్మెల్యే టికెట్టు ఇస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజుకు బీఫామ్ ఇచ్చారు.

- Advertisement -

రెండు రోజుల్లో సునీల్ కుమార్ టిడిపి తరఫున నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరగడంతో మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గీయులు మడకశిర పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యాలయంలో ఉన్న టిడిపి ఫ్లెక్సీలను, జెండాలను , మేనిఫెస్టో పుస్తకాలను దగ్ధం చేశారు. ఎమ్మెస్ రాజు గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో నామినేషన్ డేటు నాలుగు రోజులు సమయం ఉండడంతో రాష్ట్రంలో నాలుగు చోట్ల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చినట్లు తెలుస్తోంది. అనంతపురం ఉమ్మడి జిల్లా శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిరలో టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజుకు కొద్ది రోజుల వ్యవధిలో నామినేషన్ సమయం ఉండడంతో ఎమ్మెస్ రాజుకు అధిష్టానం బీఫామ్ ఇచ్చారు. స్వయానా టిడిపి అధినేత చంద్రబాబుతో ఎమ్మెస్ రాజు బీఫామ్ ను అందుకున్నారు. దీంతో డాక్టర్ సునీల్ కుమార్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News