Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Mahanandi: భక్తుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం

Mahanandi: భక్తుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం

బ్రహ్మోత్సవాలకు ఎక్కువ మంది భక్తులు

మహానంది పుణ్యక్షేత్రంలో జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు భక్తుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాటు చేశామని డిఎస్పి రవీంద్రనాథ్ తెలిపారు. మహానంది క్షేత్రానికి వచ్చే భక్తులతో మర్యాదగా పూర్వకంగా ప్రవర్తించాలని భక్తులపట్ల దురుసుగా ప్రవర్తించకూడదని నంద్యాల డిఎస్పి రవీంద్రనాథ్ రెడ్డి, రూరల్ సీఐ శివకుమార్ రెడ్డి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహాశివరాత్రిలో విధులు నిర్వహించడానికి వచ్చే పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూడాలని అన్నారు. క్షేత్ర పరిసరాల్లో రోడ్డుకు అడ్డంగా వాహనాలు నీలపకుండా సూచించిన ప్రదేశంలోనే వెహికల్స్ ను పార్కింగ్ పర్మిషన్ ఇవ్వాలని అన్నారు. బ్రహ్మోత్సవాలకు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, పిట్ ప్యాకెట్, అల్లర్లు మీద ప్రత్యేక నిఘ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహానంది ఎస్సై నాగేంద్ర ప్రసాద్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News