Monday, May 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Shilpa Ravi: రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

Shilpa Ravi: రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

గడప గడపకులో విజయవంతంగా ప్రజా సమస్యల పరిష్కారం

నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 3 వార్డు నందు 20 లక్షల రూపాయలతో నూతన సిసి రోడ్లను నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, కౌన్సిలర్ సమ్మద్ లు ప్రారంభించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక నిధులను ఏర్పాటు చేసి, వాటిని ప్రారంభించడంతో వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని మూడో వార్డు ఓల్డ్ టౌన్ నందు 20 లక్షల రూపాయలతో రెండు నూతన రెండు సిసి రోడ్లను నేడు ప్రారంభించామని, ఎంతోకాలంగా ప్రజలు రోడ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వారి సమస్యను నెరవేర్చామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం మంచి కార్యక్రమం మొదలుపెట్టిందని, ఈ కార్యక్రమం ద్వారా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే సంతోషకరమన్నారు. ఓల్డ్ టౌన్ లో ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి సచివాలయం పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశావళి, నంద్యాల పట్టణ అధ్యక్షులు పడకండ్ల సుబ్రహ్మణ్యం, జాకీర్ హుస్సేన్ వైసీపీ కౌన్సిలర్ కలాం భాష, ఆరిఫ్ నాయక్ ,తబ్రీజ్, శాదిక్ భాష , కోఆప్షన్ సభ్యులు సలాం ముల్ల ,వైసిపి నాయకులు గోపాల్, దండే సుధాకర్, దండ శ్రీను, అమీర్ ,మరియు వార్డు వైసిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News