చంద్రబాబు, పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. నమోదయిన కేసులో వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేట కోర్టు 10 రోజుల రిమాండ్ విధించింది.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ నేత కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోసానిని ఇటీవల హైదరాబాద్ అదుపులోకి తీసుకున్న.. రాయచోటి పోలీసులు అతనిని ఏపీకి తరలించిన విషయం అందరికీ తెలిసిందే.
కేసు నమోదు చేసిన నరసరావుపేట పోలీసులు ఇవాళ పీటీ వారెంట్ పై పోసానిని అదుపులోకి తీసుకున్నారు. పోసానిని ఈరోజు సాయంత్రం నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో పోసానిని గుంటూరు జైలుకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోసానిపై 17 కేసులు నమోదయ్యాయి. ఓబులవారిపల్లిలో నమోదైన కేసులో రాజంపేట జైలులో ఉన్న పోసానిపై ఉన్నతాధికారుల అనుమతితో పల్నాడు జిల్లా నరసరావుపేట టూటౌన్ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నరసరావుపేట పోలీసులకు అప్పగించే ముందు పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు.