Saturday, May 18, 2024
Homeఆంధ్రప్రదేశ్Puttaparthi: పల్లె సింధూరకు మద్దతుగా భర్త పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి

Puttaparthi: పల్లె సింధూరకు మద్దతుగా భర్త పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి

ప్రచారంలో దూసుకుపోతున్న పల్లె ఫ్యామిలీ

ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి టీడీపీని గెలిపించాలని టీడీపీ యువ నాయకుడు పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డికి మద్దతుగా నల్లమాడ మండలం వేలమద్ది, కొండకింద తాండా పంచాయతీ పరిధిలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువ నాయకులు పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డికి గ్రామస్తులు పూల వర్షం కురిపిస్తూ, బాణాసంచా కాల్చి, అపూర్వ స్వాగతం పలికారు.

- Advertisement -

ఈ సందర్భంగా యువ నేత పల్లె కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరారు. అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి, నియోజకవర్గ టీడీపి ఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లె సింధూర, హిందూపురం పార్లమెంటు టిడిపి ఉమ్మడి అభ్యర్థి పార్థసారథినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. చంద్రన్న ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు ఉపాధి లభిస్తాయన్నారు.

పుట్టపర్తి నియోజకవర్గంలో అవినీతి పాలన రాజ్యమేలుతోందని, వాటికి చమర గీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. గత టిడిపి హయాంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చేసిన అభివృద్ధి తప్పితే, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వల్ల పుట్టపర్తి నియోజకవర్గానికి ప్రత్యేకంగా వచ్చింది మాత్రం వసూళ్ల సంస్కృతి అని గుర్తు చేశారు. ఇలాంటి సంస్కృతి పోవాలంటే టిడిపి అధికారంలోకి రావాలని మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని హోటల్లో అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో టిడిపి-జనసేన-బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News