Saturday, May 18, 2024
HomeతెలంగాణRapthadu: పథకాలు ఇలాగే కొనసాగాలంటే జగనన్న సీఎం కావాలి

Rapthadu: పథకాలు ఇలాగే కొనసాగాలంటే జగనన్న సీఎం కావాలి

ప్రచారానికి భారీ జనం

ఆత్మకూరు మండలం సిద్ధరాంపురం, పి.యలేరు, పి.కొత్తపల్లి గ్రామాల్లో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారానికి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. జడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మతో కలిసి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబము లబ్ది పొందినదని ఈ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యే అన్నారు.

- Advertisement -

హిందూపురం ఎంపీగా బోయ శాంతమ్మను, రాప్తాడు ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News