Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: చెంచుల సంప్రదాయంలో మల్లన్న కళ్యాణం

Srisailam: చెంచుల సంప్రదాయంలో మల్లన్న కళ్యాణం

శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం తరుపున బ్రహ్మోత్సవ లీలాకళ్యాణం ఘనంగా సాగింది. ఈ కల్యాణానికి చెంచు గిరిజనులను ప్రత్యేకంగా ఆహ్వానించారు దేవస్థానం ఈవో లవన్న. మల్లన్నకల్యాణానికి వస్త్రాలు సమర్పించిన చెంచు గిరిజనులు ..వెదురు బియ్యం, ఆకులతో అల్లిన బాసికలు, యజ్ఞోపవితం సమర్పించారు. పార్వతి దేవిని తమ ఆడపడుచుగా భావించి ఆనవాయితీగా గత సంవత్సరం నుండి బ్రహ్మోత్సవ కల్యాణానికి చెంచు గిరిజనులు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఈ కల్యాణానికి విచ్చేసిన చెంచు గిరిజనులకు దేవస్థానం తరుపున వస్త్రాలు అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News