Saturday, July 27, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వారికి ఎమ్మెల్యే చేయూత

Srisailam: అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వారికి ఎమ్మెల్యే చేయూత

సొంత నిధుల నుంచి ఒక్కొక్క బాధితుడికి 20,000

శ్రీశైల దేవస్థానం లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ లో జరిగిన దుకాణాల అగ్నిప్రమాద బాధితులకు రూ. 2.80 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. శ్రీశైలం లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ లో ఇటీవల జరిగిన 14 దుకాణాలు అగ్ని ప్రమాద బాధితులకు తన సొంత నిధుల నుంచి ఒక్కొక్క బాధితుడికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేసిన శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. గత నెల 31న అర్ధరాత్రి దుకాణాలలో జరిగిన అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఉదయాన్నే హుటాహుటిన శ్రీశైలం చేరుకొని అగ్ని ప్రమాదం జరిగిన దుకాణాలను పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఆనాడు 14 మంది దుకాణ బాధితులకు ఒక్కొక్కరికి 20,000 చొప్పున తన సొంత నిధులు అందజేస్తానని మాట ఇచ్చి నేడు స్వయంగా శ్రీశైలం చేరుకొని బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే జరిగిన ప్రమాదం గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తానని బాధితులకు తెలిపారు. అనంతరం అగ్ని ప్రమాదానికి గురైన దుకాణాల స్థానంలో కొత్తగా నిర్మిస్తున్న దుకాణాలను ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పరిశీలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News