తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు కొండకు చేరుకుని శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ(TTD) రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి బ్రేక్ దర్శనాల కోసం భక్తులు ఇచ్చే సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించేందుకు సిద్ధమైంది. మే 15 నుంచి ఎంపీ, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయింపు పున:ప్రారంభం కానునట్లు తెలుస్తోంది.
Tirumala: శ్రీవారి బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES