Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Tirupati: తిరుపతి తొక్కిసలాట ఘటన.. రూ.25లక్షల పరిహారం

Tirupati: తిరుపతి తొక్కిసలాట ఘటన.. రూ.25లక్షల పరిహారం

తిరుపతి(Tirupati)లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఘటనకు కారణంపై విచారణ జరుగుతుందని.. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

- Advertisement -

తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతుల కుటుంబ సభ్యులను మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శించారు. అనంతరం స్విమ్స్‌ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad