Friday, April 11, 2025
Homeఆంధ్రప్రదేశ్Veldurthi: హర్షవర్ధన్ నాయుడు టోర్నీ విజేత అశోక్ 11 జట్టు

Veldurthi: హర్షవర్ధన్ నాయుడు టోర్నీ విజేత అశోక్ 11 జట్టు

వెల్దుర్తిలో గత ఐదు రోజులుగా హర్షవర్ధన్ నాయుడు జ్ఞాపకార్థం జరుగుతున్న క్రికెట్ టోర్నమెంటులో వెల్దుర్తికి చెందిన అశోక్ 11 జట్టు విజేతగా నిలిచింది. 16 జట్లు పాల్గొన్న ఈ క్రికెట్ టోర్నమెంట్లో చివరకు ఆది పురుష జట్టు, అశోక్ 11 జట్టు ఫైనల్ కు చేరాయి. ఎంతో హోరాహోరీగా జరిగిన చివరి మ్యాచ్లో అశోక్ 11 జట్టు గెలిచింది. వారికి పది వేల రూపాయల నగదుతో పాటు జ్ఞాపికను పట్టణ వైసీపీ కన్వీనర్ వెంకట్ నాయుడు, హర్షవర్ధన్ నాయుడు కుటుంబ సభ్యులు అందించారు. రన్నర్స్ గా నిలిచిన ఆది పురుష్ జట్టుకు 5,00 నగదు జ్ఞాపికను ప్రదానం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News