Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Nandigam Suresh: ఐదు నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన నందిగం సురేష్

Nandigam Suresh: ఐదు నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన నందిగం సురేష్

అమరావతి ప్రాంతానికి చెందిన మరియమ్మ హత్య కేసులో ఐదు నెలల నుంచి జైలు జీవితం గడుపుతున్న వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్(Nandigam Suresh) ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు జైలు వద్దకు భారీగా చేరుకుని స్వాగతం పలికారు. కాలర్ బోన్ సమస్యతో బాధపడుతున్న సురేష్‌కు.. గుంటూరు జిల్లా ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి విడుదలైన ఆయన చికిత్స కోసం విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ కానున్నారు.

- Advertisement -

కాగా వైసీపీ ప్రభుత్వం హయాంలో 2020లో సురేష్ అనుచరులు ఓ సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడి చేశారు. ఈ దాడిలో మరియమ్మ అనే మహిళ మృతి చెందడం సంచలనంగా మారింది. ఆమె కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విచారణ ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరియమ్మ కుమారుడు ఈ కేసు గురించి మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ దాడి నందిగం సురేష్ ప్రోద్బలంతోనే జరిగింద నిర్ధారించిన పోలీసులు ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే పలుమార్లు బెయిల్ కోసం కోర్టులను అశ్రయించినప్పటికి ఊరట దక్కలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad