Pawan speech In Yogandhra: యోగా విశిష్టతను రుగ్వేదం చెబితే ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ 2014లో ఐక్యరాజ్య సమితిలో యోగాకు సుమారు 177 దేశాల మద్దతును కూడగట్టడంలో మోడీ విజయం సాధించారన్నారు. తొలుత పవన్ ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యోగాను అందించిన పతంజలి మహర్షి పాదాలకు ఆయన నమస్కారాలు తెలియజేశారు. యోగాను విశ్వవ్యాప్తం చేసిన దర్శనికుడు మోదీ అని అన్నారు. యోగా భారతీయులకు దక్కిన గౌరమని పవన్ పేర్కొన్నారు.
ఒత్తిడిని జయించడంలో యోగా తోడ్పడుతుందని పవన్ పేర్కొన్నారు. అధిక సంఖ్యలో జనం తరలివచ్చి యోగాంధ్రను సక్కెస్ చేశారని కొనియాడారు. యోగా సాధకులు ఎంత ధృడచిత్తాన్ని కలిగి ఉంటారని, ఒత్తిడిని జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడుతారు అనే దానికి ఉదాహరణ ప్రధాని మోడీ అన్నారు. మోడీ సమక్షంలో సీఎం చంద్రబాబు కృషితో విశాఖ యోగాంధ్ర ప్రపంచ గిన్నిస్ రికార్డు నెలకొల్పిందని పవన్ అన్నారు.
కాగా, 11వ ప్రపంచ యోగా దినోత్సవానికి విశాఖ వేదికగా నిలిచింది. ‘ఒక భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా’ అనే థీమ్తో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన యోగా డే గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సుమారు 3 లక్షల మందికి పైగా యోగా వేడుకల పాల్గొని ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రులు, ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/rappa-rappa-placards-in-brs-mla-harish-rao-meeting/
26 జిల్లాల్లో 26 థీమ్ బేస్ యోగా నిర్వహించామని చంద్రబాబు అన్నారు. 100 పర్యాటక ప్రదేశాల్లో అనుకుంటే 101 చోట్ల చేశారని పేర్కొన్నారు. లక్షకు పైగా ప్రదేశాల్లో రెండున్నర కోట్లమంది యోగా చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. వర్షం పడుతుందన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా యోగాంధ్ర విజయం సాధించిందని తెలిపారు. 11వ అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు. గేమ్ ఛేంజర్గా నిలిచిన ఈ వేడుకకు ఓ లాజికల్ ముగింపు ఇస్తామని చంద్రబాబు చెప్పారు.
ALSO READ: https://teluguprabha.net/gallery/8th-pay-commission-good-news-for-central-government-employees/
కాగా, యోగాంధ్రను విజయవంతం చేయడంలో అందరూ లోకేశ్ను స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రధాని మోడీ ప్రశంసించారు. ఇంత పెద్ద వేడుకను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడంలో లోకేష్ సఫలీకృతులు అయ్యారని మోడీ కితాబిచ్చారు. అయితే యోగాంధ్రను ముందు నుంచి ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. అటు అధికారులు, ప్రజాప్రతినిధులు రేయింబవళ్లు ఇందుకోసం శ్రమించారు.
Pawan Speech On PM Modi: యోగాను విశ్వవ్యాప్తం చేసిన దార్శనికుడు మోడీ: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES