Friday, June 13, 2025
Homeకెరీర్Supplementary Results: ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Supplementary Results: ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల(Supplementary Results) ఫలితాలు విడుదలయ్యాయి. మే 19వ తేదీ నుంచి 28 వరకు నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://bse.ap.gov.in/ లేదా వాట్సాప్‌ మనమిత్ర నెంబర్‌ 95523 00009 ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఈ పరీక్షలకు మొత్తం 1,23,477 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 76.14 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం 73.55గా నమోదు కాగా.. బాలికలు 80.10 శాతం ఉత్తీర్ణత సాధించారు. 98.24 శాతం ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా టాప్ ప్లేస్ లో ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా 50.24 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది.

విద్యార్థులు మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు.

* ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009కు ‘Hi’ అని మెసేజ్ చేయాలి.
* ఆ తర్వాత ‘సెలెక్ట్ సర్వీస్’ లో ‘విద్యా సేవలు’ ఎంచుకోవాలి.
*’SSC ASE May 2025 Result- 2025′ ఆప్షన్ క్లిక్ చేయాలి.
* మార్కుల మెమో పొందడానికి మీ ‘హాల్ టికెట్’ నెంబర్‌ను నమోదు చేయాలి.
* పీడీఎఫ్ రూపంలో ఫలితాలు కనిపిస్తాయి. అనంతరం డౌన్ లోడ్ చేసుకోండి

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News