ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన పాత సినిమాలను రీరిలీజ్ చేయడం ట్రెండ్ గా మారిన సంగతి తెలిసిందే. అలా పలు సినిమాలు రీరిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపాయి. తమ హీరోల బ్లాక్ బాస్టర్ చిత్రాలను వెండితెరపై మరోసారి చూసుకుని అభిమానులు సందడి చేశారు. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘లక్ష్మీనరసింహా’(Lakshmi Narasimha) సినిమాను రీరిలీజ్ చేయనున్నారు. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీని జూన్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మూవీని థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ప్రేక్షకుల స్పందనను బట్టి ప్రదర్శనల సంఖ్యను పొడిగించే అవకాశాలున్నాయి.
అయితే ఈ రీ రిలీజ్ సందర్భంగా ఓ సరికొత్త ట్రెండ్కు చిత్ర యూనిట్ శ్రీకారం చుట్టింది. ఈ సినిమాలో ఓ కొత్త పాటను మేకర్స్ యాడ్ చేశారు. ఇందుకు సంబంధించిన లిరికల్ సాంగ్ ను తాజాగా విడుదల చేశారు. దర్శకుడు జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2004లో విడుదలై సూపర్ హిట్ అయింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన పాటలు విశేష ప్రజాదరణ పొందాయి. కానీ మూవీలో హీరో క్యారెక్టర్ను హైలైట్ చేసేలా ఉన్న ఒక పాటను కొన్ని కారణాల వల్ల సినిమాలో ఉపయోగించలేదు.
బాలయ్య అభిమానులకు ప్రత్యేక సర్ ప్రైజ్ ఇవ్వాలని భావించిన నిర్మాత బెల్లంకొండ సురేశ్.. ఇప్పుడు ఆ పాటను యాడ్ చేశారు. కేవలం సౌండ్ లేకుండా పాత విజువల్స్ మాత్రమే లభ్యం కావడంతో, వాటికి అనుగుణంగా కొత్తగా పాటను రాయించారు. ప్రఖ్యాత గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించగా, భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు. స్వరాగ్ కీర్తన్ ఈ గీతాన్ని ఆలపించారు. ‘మందేసినోడు ఘనుడు’ అంటూ సాగే ఈ పాటను తాజాగా విడుదల చేశారు.
Lakshmi Narasimha: రీరిలీజ్ లో బాలయ్య మూవీ నయా ట్రెండ్.. కొత్త పాటతో సర్ ప్రైజ్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES