Friday, July 5, 2024
Homeచిత్ర ప్రభRashmika Mandanna: రష్మిక మందన్నాకు నిరాశ.. ఓటీటీలో రిలీజ్ కానున్న తొలి బాలీవుడ్ చిత్రం

Rashmika Mandanna: రష్మిక మందన్నాకు నిరాశ.. ఓటీటీలో రిలీజ్ కానున్న తొలి బాలీవుడ్ చిత్రం

Rashmika Mandanna: బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని భావించిన రష్మిక మందన్నాకు నిరాశే ఎదురవుతోంది. ఆమె నటించిన తొలి బాలీవుడ్ చిత్రం థియేటర్లో కాకుండా ఓటీటీలో రిలీజవుతోంది. తెలుగు, తమిళ చిత్రాల్లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రష్మికా మందన్నా నటిస్తున్న మొదటి బాలీవుడ్ చిత్రం ‘మిషన్ మజ్నూ’.

- Advertisement -

సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి షంతను బాగ్చి దర్శకత్వం వహించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తైన ఈ చిత్రం విడుదల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోంది. అనేకసార్లు విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే, త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, థియేటర్లలో కాదు… డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ కానుంది.

‘మిషన్ మజ్నూ’ చిత్రం జనవరి 20న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. 1970 నేపథ్యంలో సాగే ‘స్పై’ కథతో ఈ చిత్రం రూపొందింది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా రా అధికారిగా కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని గరిమా మెహతా, అమర్ బుటాలా, రోనీ స్క్రూవాలా భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News