The Bads of Bollywood Delhi High Court: షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్ సిరీస్ పలు విమర్శలతో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్గా మారింది. ఈ వెబ్ సిరీస్లో ఈ – సిగరెట్ వాడరంటూ చిత్ర బృందానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు అందించిన విషయం తెలిసిందే.. అయితే ఈ వివాదం ముగియకముందే సిరీస్పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ అధికారి సమీర్ వాంఖడే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-viral-fever-health-update-hyderabad-tests/
‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’లో యాంటీ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో పాటు అధికారులను చెడుగా చూపించారని పిటిషన్లో సమీర్ వాంఖడే పేర్కొన్నారు. ఈ సిరీస్తో తన పరువుకు భంగం కలిగిందని.. అందుకు గాను పరువు నష్టం కింద రూ. 2 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ కేసు విషయంలో సమీర్ వాంఖడేకి చుక్కెదురైంది.
సమీర్ వాంఖడే వేసిన పిటిషన్ను స్వీకరించేందుకు నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు.. వాంఖడే తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ పిటిషన్ని ఢిల్లీలోనే ఎందుకు విచారించాలని అడిగింది. దీనిపై బదులిచ్చిన న్యాయవాది.. ఈ సిరీస్ ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ప్రసారమవుతుందని చెప్పారు. ఈ సిరీస్ను చూసి పలువురు నెటిజన్లు వాంఖడేపై వ్యంగ్యంగా మీమ్స్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇవి ఎక్కువగా ఢిల్లీలోనే కనిపిస్తున్నాయంటూ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-og-movie-hd-leak-fans-reaction/
అయితే దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ‘మీరు వేసిన పిటిషన్ సరికాదు. దీనిని మేం విచారించలేం. మీకు ఢిల్లీ నుంచే ఎక్కువ నష్టం కలిగిందని భావిస్తే అందుకు అనుగుణంగా పిటిషన్ని వేయండి. అప్పుడు పరిగణనలోకి తీసుకుంటాం.’ అంటూ కోర్టు స్పష్టం చేసింది.


