Tuesday, May 20, 2025
Homeనేరాలు-ఘోరాలుBhimadevarapalli: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

Bhimadevarapalli: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

శోకసంద్రంలో కుటుంబం

భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన కొంగళ్ల యుగేందర్ (36) గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. యుగేందర్ 8వ బెటాలియన్ కొండాపూర్ లో టిఎస్ఎస్పి కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. రాత్రి ఛాతీ నొప్పి లేస్తుంది అని తన తండ్రి మల్లయ్యకు చెప్పుకున్నాడు. తెల్లవారు జామున డ్యూటీకి వెళ్ళమని తండ్రి పిలిచిన లేవకపోవడంతో చుట్టు పక్కల వాళ్ళని పిలిచి చూపించగా మృతి చెంది ఉన్నాడు. తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు వంగర నీలోజు వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News