Saturday, July 27, 2024
Homeనేరాలు-ఘోరాలుChegunta: చేగుంటలో దొంగల బీభత్సం

Chegunta: చేగుంటలో దొంగల బీభత్సం

అర్థరాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి..

చేగుంట మండల కేంద్రానికి చెందిన సోమ రాము అనే వ్యక్తి ఇటీవల తన వ్యవసాయ భూమి అమ్ముకోగా వచ్చిన 11 లక్షలను ఇంట్లో బీరువాలో పెట్టి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి, చేగుంటలోని సీఎంఆర్ కాలనీలో తను కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటి వద్ద సిమెంటు బస్తాలకు కాపలాగా పడుకోగా, తన భార్య వజ్రమని మక్కరాజ్ పేటలో బదువుల ఇంటివద్ద శుభకార్యం ముగించుకొని ఈరోజు ఉదయం 6 గంటలకు ఇంటి వద్ద చూడగా తాళాలు పగలగొట్టి ఉన్న ఇల్లు బీరువా, బీరువాలోని 11 లక్షల నగదు మాయమైనట్టు గ్రహించి భర్త రాముకి ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయగా, చేగుంట పోలీసులు, క్లూస్ టీం, తూప్రాన్ డిఎస్పీ సామా వెంకట్ రెడ్డి, రామాయంపేట సి.ఐ వెంకటేష్, చేగుంట యస్.ఐ బాల్రాజ్ వచ్చి పరిశీలించి బాధితుని నుండి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News