Thursday, September 5, 2024
Homeనేరాలు-ఘోరాలుEmmiganuru: లక్ష విలువ చేసే కర్ణాటక మద్యం పట్టివేత

Emmiganuru: లక్ష విలువ చేసే కర్ణాటక మద్యం పట్టివేత

స్కార్పియో వాహనంలో స్మగ్లింగ్

అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం ను ఎమ్మిగనూరు సెబ్ పోలీసులు పట్టుకున్నారు. కర్నూలు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ కృష్ణకాంత్ పటేల్ ఆదేశాలు మేరకు ఎమ్మిగనూరు సెబ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జయరామ్ నాయుడు అధ్వర్యంలో మంత్రాలయం మండలం మాలపల్లి గ్రామ క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా స్కార్పియో వాహనం వచ్చింది. పోలీసులను చూసి కొంత దూరంలో వాహనంను ఆపి ఒక వ్యక్తి పరాయ్యాడు. దీంతో వాహనంను తనిఖీ చేయగా అందులో లక్ష రూపాయలు విలువ చేసే 20 కర్ణాటక టెట్రా ప్యాకెట్ల మద్యం గుర్తించారు. 1920 ప్యాకెట్ల (90 ఎంఎల్) ఒరిజినల్ చాయిస్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్యక్రమంలో ఎస్ఐ సోమ శేఖర్ రావు,హెడ్ కానిస్టేబుల్ గోపాల్, లింగ ప్రసాద్, గౌస్ రబ్బానీ, వెంకట రాముడు, కానిస్టేబుల్స్ రామచంద్రుడు, చంద్రమౌళి నరసింహ రెడ్డి, రాధమ్మ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News