Sunday, July 7, 2024
Homeనేరాలు-ఘోరాలుGarla: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

Garla: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గార్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఏఎస్ఐ రవీందర్ కథనం ప్రకారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక గాంధీ పార్క్ సమీపంలో నివాసముంటున్న ఉపేందర్ మద్యానికి బానిసై, అనారోగ్యంతో బాధపడుతూ, మనస్థాపానికి గురై, తెల్లవారుజామున సూసైడ్ నోట్ రాసి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉండగా, ఉపేందర్ పెయింటర్ గా పనిచేస్తూ, మద్యానికి బానిసై, తరచూ ఇబ్బందులకు గురి చేయడంతో భార్య కృష్ణవేణి ఇద్దరు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళింది. గత 15 సంవత్సరాలుగా ఉపేందర్ తల్లి వద్దనే ఉంటున్నాడు. తల్లి ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉంటూ తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడటంతో స్థానికులు తల్లి కమలమ్మకు సమాచారం అందజేయడంతో తల్లి కమలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ ఐ రవీందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కు తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News