Saturday, October 5, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: వ్యాపారి కిడ్నాప్ కేసులో అయినవారే సూత్రధారులు

Hyd: వ్యాపారి కిడ్నాప్ కేసులో అయినవారే సూత్రధారులు

యూసుఫ్ గూడకు చెందిన వ్యాపారి కిడ్నాప్ కేసును పంజాగుట్ట పోలీసులు ఛేదించారు. బాధితుడి బామ్మర్దే ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. ఈ మేరకు పంజాగుట్ట పోలీసు స్టేషనులో సీఐ హరిశ్చంద్ర రెడ్డి తో కలసి ఏసీపీ మోహన్ కుమార్ వివరాలను వెల్లడించారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం జనవరి 27న లాల్ బంగ్లా వద్ద యూసుఫ్ గూడలో నివాసం ఉండే బివి మురళీకృష్ణ అనే వ్యాపారిని ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల పేరిట పలువురు కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేశారన్నారు. అనంతరం రామోజీ ఫిలింసిటీ దగ్గరలోని ఓఆర్ఆర్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారన్నారు. నాలుగు టీంలుగా విడిపోయి విచారణ చేపట్టారని పేర్కొన్నారు. విచారణలో భాగంగా బాధితుడు మురళీకృష్ణ బామ్మర్ది రాజేశ్ కిడ్నాప్ కుట్రలో ప్రధాన సూత్రధారిగా గుర్తించినట్లు వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News