Thursday, July 4, 2024
Homeనేరాలు-ఘోరాలుShraddha Case : నార్కో పరీక్షలో నేరాన్ని ఒప్పుకున్న అఫ్తాబ్.. నెక్ట్స్ ఏంటి ?

Shraddha Case : నార్కో పరీక్షలో నేరాన్ని ఒప్పుకున్న అఫ్తాబ్.. నెక్ట్స్ ఏంటి ?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యకేసు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా నార్కో అనాలిసిస్ పరీక్షలో శ్రద్ధను తానే హతమార్చినట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు. డిసెంబర్ 1న అఫ్తాబ్ కు నార్కో అనాలిసిస్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో శ్రద్ధాను తానే చంపానని అంగీకరించిన అఫ్తాబ్.. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని ఎక్కడ దాచి పెట్టిందీ వెల్లడించాడు. శ్రద్ధను చంపేటపుడు ఆమె ఎలాంటి దుస్తులు ధరించి ఉందో కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆమె ఫోన్ వివరాలను కూడా అఫ్తాబ్ వెల్లడించినట్లు సమాచారం.

- Advertisement -

నిన్న ఉదయం 8.40 గంటల సమయంలో తీహార్ జైల్లో ఉన్న అఫ్తాబ్ ను అధికారులు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 10 గంటల వరకు నార్కో పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత అతడిని అబ్జర్వేషన్‌లో ఉంచారు. నార్కో పరీక్షల సమయంలో సైకాలజిస్ట్, ఫొటో ఎక్స్‌పర్ట్, అంబేద్కర్ ఆసుపత్రి వైద్యులు ఉన్నట్టు ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ సంజీవ్ గుప్తా తెలిపారు. పాలీగ్రాఫ్, నార్కో అనాలిసిస్ పరీక్షల్లో అఫ్తాబ్ చెప్పిన సమాధానాలను విశ్వేషించేందుకు నేడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా.. నాలుగురోజుల క్రితం అఫ్తాబ్ ను తీహార్ జైలుకు తరలిస్తుండగా.. శ్రద్ధ తరపు బంధువులు అఫ్తాబ్ ను హతమార్చేందుకు తల్వార్లతో దాడి చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News