Tuesday, September 17, 2024
Homeనేరాలు-ఘోరాలుMoinabad: మంటల్లో కాలుతున్న మహిళ, వీడియో వైరల్

Moinabad: మంటల్లో కాలుతున్న మహిళ, వీడియో వైరల్

మొయినాబాద్ మండలం బాకారం, జాగీర్ డ్రీమ్ వ్యాలి వద్ద..

రోజు రోజుకు మనిషి విచక్షణ కోల్పోతుండు. మానవత్వం మంటగలుస్తుంది. మనిషి చేయకూడని దారుణాలకు వొడిగడుతుండు. పల్లె పట్టణం తేడాలేకుండా ఎక్కడ బడితే అక్కడ దుర్మార్గమైన ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు ఈ దారుణాలకు అడ్డాగా మారాయి.

- Advertisement -

వివరాలోకి వెళితే రంగారెడ్డి మొయినాబాద్ మండలం బాకారం జాగీర్ లో మంటల్లో కాలుతున్న గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన వెలుగుచూసింది. మొయినబాద్ మండలం బాకారం గ్రామ రెవెన్యూలో ఉన్న డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పక్కన మంటలలో కాలుతున్న బాడీని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చే వరకు డెడ్ బాడీ కాలుతూనే ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరలైది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంటలల్లో కాలుతున్న శవం బాకారం వెల్లే రోడ్డు పక్కన ఉందని మధ్యాహ్నం ఒకటి నుండి రెండు గంటల సమయంలో స్థానికులు సమాచారం ఇచ్చారు. కాలిన మృతదేహం 20నుంచి 25 సంవత్సరాల వయసు ఉంటుందన్నారు. ఎక్కడో చంపి ఇక్కడ తగల బెట్టారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మృతదేహం పక్కన సగం కాలిన ఫోన్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.క్లూస్ టీమ్ ని రప్పిస్తున పోలీసులు చుట్టూ ప్రక్కల వారిని విచారిస్తున్నారు. చేవెళ్ల ఏసిపి ప్రశాంత్ రెడ్డి కేసు దర్యాప్తు చేసేందుకు మూడు టీంలను ఏర్పాటు చేశామన్నారు.
సంఘటన స్థలనికి పరిశీలిస్తున్న రాజేంద్ర నగర్ అడిషనల్ డీసీపీ సాధన రేష్మి పెరుమాళ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News