Saturday, July 27, 2024
Homeనేరాలు-ఘోరాలుSangareddy: 8 గం. పవర్ కట్, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం

Sangareddy: 8 గం. పవర్ కట్, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం

కనీస సమాచారం లేకుండానే..

సంగారెడ్డి పట్టణంలోని 33 వార్డులో రెవెన్యూ కాలనీవాసులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ట్రాన్స్ఫార్మర్ పనులు నిర్వహించారు. నిర్వహించాలంటే ముందస్తు కాలనీవాసులకు సమాచారం ఇచ్చి ఎన్ని గంటలు కరెంటు అంతరాయము ఉంటుందని తెలియజేయాలి.. కానీ ఇష్టానుసారం పనులు నిర్వహించారు. కాలనీవాసుల అనుమతి లేకుండానే రోడ్డుపైన టాస్మోన్వర్ బిగించారు.. ట్రాన్స్ఫార్మర్ మార్పిడి చేయాలంటే చుట్టుపక్కల ఉన్న వారి సమాచారం తీసుకోవాలి. ఎటువంటి సమాచారం లేకుండానే. ట్రాన్స్ఫార్మర్ రోడ్డుపై బిగించారు. ఎలక్ట్రికల్ డిఏకి ఫోన్ చేయగా ఇది నాకు సమాచారం లేదని తెలిపారు. తెలుసుకుంటానని చెప్పడం ఎంతవరకు సమంజసం అని కాలనీ వాసులు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News