Saturday, July 27, 2024
Homeఆంధ్రప్రదేశ్Buggana Budget: బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్

Buggana Budget: బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్

ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథలా భావించిన జగన్

బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ అంటూ మీడియాతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథలా భావించి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ బుగ్గన వివరించారు.

- Advertisement -

ఆర్థిక పరిస్థితి బాగుంటే, కోవిడ్ లేకపోయి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసేవాళ్లమని, మా ప్రభుత్వ హయాంలో చేయాల్సిన దాని కన్నా అట్టడుగువర్గాలకు ఎక్కువ మేలు చేశామని బుగ్గన చెప్పుకొచ్చారు. బతకడం కష్టంగా ఉన్న నిస్సహాయ పేద వర్గాలే మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అంటూ ఆయన వెల్లడించారు.

గత ఐదేళ్ల బడ్జెట్ లో విద్య, వైద్యం, మహిళా సాధికారత, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసినట్టు బుగ్గన వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News