Sunday, June 23, 2024
Homeనేరాలు-ఘోరాలుKarimngara: మావోయిస్టుల దంపతుల లొంగుబాటు

Karimngara: మావోయిస్టుల దంపతుల లొంగుబాటు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయినట్లు కరీంనగర్, ప్రస్తుత ఇంచార్జ్ వరంగల్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు. లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు సెంట్రల్ కమిటీ మెంబెర్ మరియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇంచార్జి వద్ద సుష్మిత సెంట్రల్ కమిటీ స్టాఫ్ గా, దూల ప్రొటెక్షన్ టీం మెంబర్ గా పనిచేశారని తెలిపారు.
పోలీస్ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం…
హన్మకొండ జిల్లా హాసనపర్తి మండలం సుదంపల్లి గ్రామానికి చెందిన తిక్క సుశ్మిత 27 తన ఇంటర్మీడియేట్ వరకు చదువుకుంది. తన తండ్రి అయినా తిక్క సుధాకర్ మావోయిస్టు సానుభూతిపరుడుగా పనిచేశాడని అతన్ని చూసి ఆకర్షితురాలైన సుష్మిత తన చదువు అనంతరం 2016 వ సంవత్సరంలో ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కోమటిపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సమక్షంలో మావోయిస్టు పార్టీలో చేరిందన్నారు.
ఛత్తీస్ గడ్ రాష్ట్రం సుకుమా జిల్లా , పరియా గ్రామానికి చెందిన మడకందూల అలియాస్ దూల ఐదవ తరగతి వరకు చదువుకున్నాడు. తన అన్నయ్య అయినా ఐయేత 2008 సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరాడని, అతన్ని చూసి ఆకర్షితుడైన దూల 2015 వ సంవత్సరంలో ఏరియా కమిటీ మెంబర్ అయిన జోగి ప్రోత్సాహంతో సిపిఐ మావోయిస్టు పార్టీలో చేరినట్లు చెప్పారు.
మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి 2020 మార్చి నెలలో 30 వ తేదీన వివాహం చేసుకున్నారని, తరువాత వివిధ హోదాల్లో పలు చోట్ల పనిచేసినట్లు తెలిపారు.
మావోయిస్టు సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోయి, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకం గురించి తెలుసుకుని ఆకర్షితులైన వీరిరువురు శుక్రవారం వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారని అన్నారు.
వీరిరువురికి ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయలు నగదు రివార్డ్ వున్నదని ఆ మొత్తాన్ని సీపీ చేతుల మీదుగా బ్యాంకు డీడీ రూపంలో వారికి అందజేసినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాజిపేట ఏసీపీ పి తిరుమల్, హాసనపర్తి ఇన్స్పెక్టర్ జె సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News