Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుKautalam: పిచ్చికుక్క స్వైర విహారం, ఐదు మంది చిన్నారులకు గాయాలు

Kautalam: పిచ్చికుక్క స్వైర విహారం, ఐదు మంది చిన్నారులకు గాయాలు

గత కొన్ని రోజులుగా ఇది రొటీన్ గా మారింది

కౌతాళం మండల కేంద్రమైన కౌతాళంలోని హనుమాన్ నగర్ లో పిచ్చికుక్క స్వైర విహారం చేయడంతో ఐదు మంది చిన్నారులకు రక్త గాయాలయ్యాయి. ఆరుబయట చిన్నారులు ఆడుకుంటూ ఉండగా పిచ్చికుక్క స్వైర విహారం చేసింది.. గత కొన్ని రోజులుగా తమ కాలనీలో పిచ్చికుక్క బెడద అధికమైందని స్థానికులు ఆవేదనను వ్యక్తం చేశారు.. కాలనీకి చెందిన రమేషు, లింగన్న, మరో నలుగురు చిన్నారులు పిచ్చికుక్క దాడిలో రక్త గాయాలకు గురయ్యారు.. గాయాలకు గురైన చిన్నారులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.. తల్లిదండ్రులు సైతం చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు కోరారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News