Friday, October 18, 2024
Homeనేరాలు-ఘోరాలుExtra Marital Affair : పక్కింటి ఆంటీతో తండ్రి రాసలీలలు చూసిన కొడుకు.. ఆ తర్వాత...

Extra Marital Affair : పక్కింటి ఆంటీతో తండ్రి రాసలీలలు చూసిన కొడుకు.. ఆ తర్వాత చేతుల్ని నరికేసి..

మన చుట్టూ ఉన్న సమాజం ఎలా ఉందో రోజూ చూస్తుంటాం. ఒకరితో పెళ్లి.. మరొకరితో కాపురం అన్నట్లు తయారయ్యారు మనుషులు. నూరేళ్ల పెళ్లి బంధానికి విలువ లేకుండా పోతోంది. తాత్కాలిక శారీరక సుఖం కోసం మానవ విలువల్ని, కుటుంబ వ్యవస్థల్ని మంటగలుపుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఓ ఘటన వెలుగుచూసింది. పక్కింటి ఆంటీతో తండ్రి చేస్తున్న రాసలీలలను కళ్లారా చూశాడు అతని 15 ఏళ్ల కొడుకు. ఈ విషయం అతను ఎవరికి చెప్తాడోనన్న భయంతో ఆ తండ్రి కొడుకుని అతికిరాతకంగా హతమార్చాడు. అందుకు పక్కింటి ఆంటీ కూడా సహకరించింది. ఆ తర్వాత ఏమీ తెలీనట్టు కొడుకుపై మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

- Advertisement -

మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ జిల్లా బరోఠా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాంగరాదా గ్రామంలో డిసెంబర్ 4న తన తండ్రి (45) సమీప బంధువైన, పక్కింట్లో ఉండే ఆంటీతో ఒకే గదిలో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను బాలుడు చూశాడు. అది గమనించిన బాలుడి తండ్రి ఐదేళ్లుగా సాగిస్తున్న తమ అక్రమ సంబంధం ఎక్కడ బయటపడుతుందోనని భయపడి, కన్న మమకారాన్ని మరచి బాలుడి చేతుల్ని నరికేశాడు. ఆపై అతడిని చంపేశాడు. చేతుల్ని 400 అడుగుల బోరుబావిలో పడేశాడు. మృతదేహాన్ని పొలాల వద్ద పొదల్లో పడేశాడు. గత మంగళవారం రెండ్రోజుల తర్వాత డిసెంబర్ 6న పంటపొలాల పొదల్లో స్థానికులు బాలుడి మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అప్పటికే కొడుకు మిస్సింగ్ కంప్టైంట్ ఇచ్చిన తండ్రిపై అనుమానం వ్యక్తం చేశారు. తొలుత ప్రశ్నించగా.. అమాయకుడిలా నటించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా అసలు విషయాన్ని చెప్పాడు. తన అక్రమ సంబంధం బయటపడుతుందన్న ఆందోళనతోనే ఈ హత్యచేసినట్లు అంగీకరించాడు. దాంతో తండ్రిని, హత్యకు సహకరించిన ప్రియురాలిని పోలీసులు అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News