Thursday, April 10, 2025
Homeనేరాలు-ఘోరాలుMid-day meal: మధ్యహ్న భోజనంలో పాము..ఆసుపత్రి పాలైన స్టూడెంట్స్

Mid-day meal: మధ్యహ్న భోజనంలో పాము..ఆసుపత్రి పాలైన స్టూడెంట్స్

మిడ్డే మీల్ లో శుభ్రత లేకపోగా విద్యార్థులను రోగాలపాలు చేస్తున్న ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా మధ్యహ్న భోజనాన్ని పిల్లలకు అందిస్తున్నారు. వెస్ట్ బెంగాల్ లోని బీర్భూమ్ జిల్లాలో మధ్యహ్న భోజనంలో పాము పడిన విషాహారాన్ని తిన్న విద్యార్థులు అనారోగ్యంతో ఆసుపత్రిపాలయ్యారు. సుమారు 30 మంది ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు ఇలా సోమవారం రోగాలపాలయ్యారు. వాంతులు చేసుకుంటున్న పిల్లలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక్క విద్యార్థి తప్ప మిగతా విద్యార్థులందరినీ ఇప్పటికే డిస్చార్జ్ చేసినట్టు జిల్లా విద్యాధికారి చెబుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ పై దాడిచేసి, ధ్వంసం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News