Sunday, July 7, 2024
HomeదైవంAhobilam Paruveta: రెండో విడత మొదలైన పారువేట పల్లకి

Ahobilam Paruveta: రెండో విడత మొదలైన పారువేట పల్లకి

మందలూరులో ఉత్సవ మూర్తులకు ఘనంగా పూజలు

శ్రీ లక్ష్మీనరసింహస్వామి పారువేట ఉత్సవాలలో భాగంగా రుద్రవరం మండలంలో రెండవ విడత పారువేట పల్లకి సందర్శన మండలంలోని మందలూరు గ్రామం నుండి ప్రారంభమైంది. ఇందులో భాగంగా మందలూరు గ్రామంలో శుక్రవారం పల్లకిలో కొలువుదీరిన ఉత్సవమూర్తులకు భక్తులు ఘనంగా పూజలు నిర్వహించారు. పారువేట ఉత్సవాలలో భాగంగా గ్రామానికి చేరుకున్న శ్రీ జ్వాలా నరసింహస్వామి శ్రీ ప్రహల్లాద వరద స్వామి ఉత్సవ మూర్తుల పారువేట పల్లకి గ్రామంలోని ఆయా తెలుపులపై కొలువుదీరగా తెలుపుల యజమానులు భక్తులు పూలమాలలు కొబ్బరికాయ పూజా సామాగ్రి సమర్పించుకోగా ప్రధానార్చకుడు సంతాన స్వామి పూలమాలలతో స్వామి వారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తుల పారువేట పల్లకి సందర్భంగా గ్రామంలో తిరుణాల వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News