Do’s and Don’t on Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి ఎంతో పవిత్రమైనది. ఈ పౌర్ణమి పర్వదినాన్ని శివ భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు నది స్నానం, దీపారాధన వంటివి ఎక్కువగా చేస్తుంటారు. వీటివల్ల కోరిన కోరికలు నెరవేరి, పాపమంతా పోతుందని పండితులు చెబుతుంటారు. ఈ ఏడాది నవంబర్ 5న కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని జరుపుకోనున్నారు. ఎంతో పవిత్రమైన ఈ రోజు కొంతమంది తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. దీనివల్ల వారికి రావాల్సిన ఎంత పుణ్యమైనా కూడా పాపమవుతుందని పండితులు అంటున్నారు. అందుకే ఈ మిస్టేక్స్ అస్సలు చేయకూడదని చెబుతుంటారు. కొందరు మాత్రం నిష్ఠతో అన్ని పూజలు చేస్తుంటారు. అయితే, కార్తీక పౌర్ణమి నాడు చేయాల్సిన, చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చేయకూడని పనులు ఇవే..
కార్తీక పౌర్ణమి నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో చీకటిగా ఉండకూడదు. దీనివల్ల ఇంట్లో సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇళ్లు దీపాలతో బాగా కనిపించేలా అలంకరించుకోవాలని పండితులు సలహా ఇస్తున్నారు. అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదని పండితులు అంటున్నారు. అలాగే పేద వారికి సాయం చేయాలని, ఇంటికి వచ్చిన వారిని అసలు ఖాళీగా పంపకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే ఇతరులను అవమానించకూడదని, అసభ్యకరంగా మాట్లాడకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు. పౌర్ణమి నాడు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని చెబుతున్నారు. అలాగే కార్తీక పౌర్ణమి నాడు వస్త్రం, పేద వారికి ఆహారం, బెల్లం వంటివి దానం చేయడం వల్ల అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని నిపుణులు అంటున్నారు.
చేయాల్సిన పనులు ఇవే..
కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. అలా 365 వత్తులు వెలిగించడం ద్వారా ఏడాదిలో ఏ ఒక్కరోజు దీపం వెలిగించకపోయినా కోల్పోయిన పుణ్యాన్ని తిరిగి పొందవచ్చు. కార్తీక పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తే కూడా మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. నారాయణుడిని, శివుడిని కలిసి పూజిస్తే విశేష ఫలితాలను పొందవచ్చుని పండితులు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర స్నానం చేసి విష్ణువును, లక్ష్మీదేవిని ఆరాధించాలి. నదిలో దీపాలను దానం చేస్తే మంచిది. అలా కుదరకపోతే ఆలయంలో దీపాన్ని దానం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఎంతో మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే బెల్లం, దుస్తులు వంటివి దానం చేయడం వల్ల అంతా శుభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు.


