Sunday, November 16, 2025
HomeదైవంMahanandi: కమనీయం మహానందీశ్వరుని రథోత్సవం

Mahanandi: కమనీయం మహానందీశ్వరుని రథోత్సవం

శివ నామ స్మరణతో మార్మోగిన మహానంది

మహానందిలో ఆశేష భక్తజనం నడుమ మహానందీశ్వరుని రథచక్రాలు ముందుకు కదిలాయి. అశ్వ వాహనంపై స్వామి అమ్మవార్లు కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఈవో చంద్రశేఖర్ రెడ్డి, సుధాకుమారి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

సాయంత్రం రథోత్సవం వేడుక నేత్ర శోభితంగా కొనసాగింది. వివిధ రకాల పుష్పాలతో రథాన్ని విశేషంగా అలంకరించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, రథంపై అధిష్టింపజేశారు.

ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డీవో మల్లికార్జున రెడ్డి, తహసిల్దార్ రామచంద్రుడు,ప్రత్యేక పూజలు నిర్వహించి, రథోత్సవాన్ని ప్రారంభించారు.అనంతరం డప్పు వాయిద్యాలు, ఓం
నమశ్శివాయ నామస్వరణలతో రథోత్సవం వేడుక వైభవంగా నిర్వహించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి.రాత్రి మహానందీశ్వరుని దంపతులకు పుష్ప శాయనోత్సవం వేడుక నేత్రశోభితంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమ దేవస్థానం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad