మహానందిలో ఆశేష భక్తజనం నడుమ మహానందీశ్వరుని రథచక్రాలు ముందుకు కదిలాయి. అశ్వ వాహనంపై స్వామి అమ్మవార్లు కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఈవో చంద్రశేఖర్ రెడ్డి, సుధాకుమారి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/7d53bd01-c817-4a66-bd1e-f1c6d7e8e3c3-1024x683.jpg)
సాయంత్రం రథోత్సవం వేడుక నేత్ర శోభితంగా కొనసాగింది. వివిధ రకాల పుష్పాలతో రథాన్ని విశేషంగా అలంకరించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, రథంపై అధిష్టింపజేశారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/30b5c1fc-d2ce-4b7c-9dd2-9bafc9ec13b4-1024x682.jpg)
ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డీవో మల్లికార్జున రెడ్డి, తహసిల్దార్ రామచంద్రుడు,ప్రత్యేక పూజలు నిర్వహించి, రథోత్సవాన్ని ప్రారంభించారు.అనంతరం డప్పు వాయిద్యాలు, ఓం
నమశ్శివాయ నామస్వరణలతో రథోత్సవం వేడుక వైభవంగా నిర్వహించారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/2088e6e9-7a10-453e-949c-5251c34b571b-1024x683.jpg)
సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి.రాత్రి మహానందీశ్వరుని దంపతులకు పుష్ప శాయనోత్సవం వేడుక నేత్రశోభితంగా నిర్వహించారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/43917ad1-43f5-44f8-9177-711ca7f57f14-1024x683.jpg)
ఈ కార్యక్రమ దేవస్థానం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/a697e829-0833-4214-90ce-04fdc8e6a848-1024x683.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/a971cc72-a248-4954-a531-d8343f611d06-1024x683.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/dbd5752b-6c4c-4ad6-bc25-85cd51b8a10c-1024x682.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/e3dcc1d4-7c67-4022-b8f9-640e8889726f-1-1024x683.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/03/feb36f99-2cab-40b4-9994-97714dca8c25-1024x683.jpg)