ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం మార్చి (29 రోజులు) నెల హుండీ ఆదాయం లెక్కింపు పూర్తి అయ్యిందని మఠం మేనేజర్ ఎస్ కే శ్రీనివాసు రావు తెలిపారు. కరెన్సీ మొత్తం రూ.2,25,14,080, నాణేలు రూ.5,12,400, మొత్తం రూ.2,30,26,480, బంగారం 81 గ్రాములు , వెండి 848 గ్రాములు లభించినట్లు తెలిపారు.