Thursday, September 19, 2024
HomeదైవంMantralayam: ఘనంగా రాయరు జన్మదినోత్సవం

Mantralayam: ఘనంగా రాయరు జన్మదినోత్సవం

శ్రీరాఘవేంద్రస్వామి 428వ జన్మదినోత్సవం సందర్భంగా శ్రీమఠంలో పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీవేంకటేశ్వర స్వామి వస్త్రాలను టీటీడీ డీపీటీ ఈవో హరినాథ్ మంత్రాలయంకు తీసుకొచ్చారు. ఈసందర్భంగా శ్రీమఠం సాంప్రదాయాల మేరకు టీటీడీ పట్టువస్త్రాలను పీఠాధిపతులు శ్రీసుభందేంద్ర తీర్థులు స్వీకరించి స్వామి బృందావనానికి టీటీడీ వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పీఠాధిపతులు మహాపంచామృత అభిషేకం నిర్వహించి ప్రాతఃకాల రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా చెన్నైకి చెందిన గణేషన్ బృందం 300 మంది కళాకారులు నాదహారం సమర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News