Monday, November 17, 2025
HomeదైవంSrisailam: అంగరంగ వైభవంగా భ్రమరాంబ మల్లికార్జునుల బ్రహ్మోత్సవాలు

Srisailam: అంగరంగ వైభవంగా భ్రమరాంబ మల్లికార్జునుల బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటాయి. నిన్న మూడోరోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామివారు హంస వాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో హంసవాహనంలో అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించి, ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నులపండువగా గ్రామోత్సవానికి తరలివెళ్ళగా రాజగోపురం గుండా హంస వాహనాధీశులైన శ్రీస్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా బజంత్రీల నడుమ శ్రీశైలం పురవీధుల్లో కన్నులపండువగా విహరించారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad