Saturday, September 21, 2024
HomeదైవంTandur: శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన

Tandur: శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన

ముఖ్యఅతిథిగా పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డి

  • వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని రాజీవ్, ఇందిరమ్మ కాలనీలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఇందిరమ్మ కాలనిలోని శ్రీ తుల్జా భవానిమాత దేవాలయం నుండి రాజీవ్ కాలనీ హనుమాన్ దేవాలయం వరకు  శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం ఊరేగింపుతో కాలనీవాసులు  అంగరంగ వైభవంగా నిర్వహించారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని వేద పండితులు నిర్వహించారు. గోపూజా, అఖండ దీపారాధన, గణపతి పూజ, పుణ్యాహవాచనం, అష్టదిక్పాలక, క్షేత్ర పాలక ఆహ్వానము, జలాధివాసము, ధాన్యాధివాసము, నైవేద్యం, మహా మంగళ హారతి, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభం కావడంతో భక్తులకు మూడు రోజులపాటు అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సహాయంతో నిర్వహిస్తున్నారు.

- Advertisement -
  • ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ వెంకన్న గౌడ్, వార్డు ఇంచార్జ్ హుస్సేన్, దేవాలయ కమిటీ చైర్మన్ టి.సాయప్ప, అధ్యక్షులు మునేందర్, ఉపాధ్యక్షులు సి.వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకన్న, కోశాధికారి భద్రేశ్వర్, సహాయక కార్యదర్శి ప్రళద్ జాధవ్, సభ్యులు నర్సింలు, సంజీవ్, వెంకటరెడ్డి, ప్రశాంత్, ఎలామంద సాయి కృష్ణ, దిలీప్ గౌడ్, మహేష్ రెడ్డి, సుందర్ , నిరంజన్ గౌడ్ , అమర్నాథ్,  ప్రశాంత్ రెడ్డి, సాయి పవర్, రోహిత్ సుగంధి, రమేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News