Thursday, February 20, 2025
Homeఓపన్ పేజ్Samayam by CS Sarma: ట్రంప్‌ ఒక విష వలయం ..!

Samayam by CS Sarma: ట్రంప్‌ ఒక విష వలయం ..!

పర్సనల్ టూర్!

ఇంట గెలిచి రచ్చ గెల­వ­మం­టారు పెద్దలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్ని­కల్లో ఘన విజ­యంతో.. ప్రధా­న­మంత్రి నరేంద్ర మోదీ ఒక రకంగా ఇంట విజయం సాధిం­చి­నట్లే అని చెప్పు­కో­వాలి. కానీ, మరి రచ్చ కూడా ఆయన గెలి­చారా? ఎందు­కంటే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్ని­కల ఫలి­తాలు వచ్చిన కొద్ది రోజు­లకే, అంటే అస­లింకా ఢిల్లీ ముఖ్య­మంత్రి ఎవ­ర­న్నది ప్రక­టిం­చక ముందు­గానే ఆయన ఒక ప్రత్యేక విమానం తీసు­కుని అమె­రికా బయ­ల్దే­రి­పో­యారు. మధ్యలో ఫ్రాన్స్​‍లో కొందరు మిత్రు­లను పల­క­రించి, అక్క­డి­ నుంచి తనకు అత్యంత ప్రియ ­మి­త్రు­డిగా చెప్పు­కొనే డొనాల్డ్​‍ ట్రంప్‌ రెండో­సారి అధి­కారం చేప­ట్టిన సంద­ర్భంగా ఆయ­నను వ్యక్తి­గ­తంగా, నేరుగా అభి­నం­దిం­చేం­దుకు వాషిం­గ్టన్‌ డీసీ వెళ్లారు. అక్కడ ఇద్దరి మధ్య కర­చా­ల­నాలు, కౌగి­లిం­తలు వరకు బాగానే అయి­పో­యాయి. కానీ…అసలు మోదీ అమె­రికా పర్య­ట­నతో భార­త­దే­శా­నికి, భార­తీ­యు­లకు ఒరి­గిం­దే­మిటి? అసలే ప్రస్తుతం అంతా అని­శ్చితి నెల­కొన్న పరి­స్థి­తుల్లో.. అక్కడి నుంచి భారీ సంఖ్యలో భార­తీ­యు­లను సంకెళ్లు వేసి మరీ డిపో­ర్టే­షన్‌ చేసే­స్తున్న తరు­ణంలో తనకు అత్యంత ప్రియు­డైన మిత్రుడి వద్దకు వెళ్లి ప్రధా­న­మంత్రి సాధిం­చింది ఏంటి? ఇద్దరూ ఒక­రి­నొ­కరు నువ్వు గ్రేట్‌ అంటే నువ్వు గ్రేట్‌ అని పర­స్పర పొగ­డ్తల కార్య­క్రమం మాత్రమే చేసు­కుంటే సరి­పో­తుందా? మన దేశ ప్రజ­లకు అణు­మా­త్ర­మైనా మేలు ఏమైనా కలి­గిందా? ఈ ప్రశ్న­ల­న్నిం­టికీ దాదా­పుగా లేదనే సమా­ధా­నమే వస్తోంది. దౌత్య విధా­నంలో అత్యంత సమ­ర్థ­మైన ప్రభు­త్వంగా పేరొం­దిన ఎన్డీయే సారథి ఈసారి అమె­రికా వెళ్లి మాత్రం సాధిం­చింది ఏమీ లేదనే చెప్పు­కో­వాల్సి వస్తోంది. ఎందు­కంటే.. ఆయన అక్కడ ఉండ­గానే హెచ్‌1బీ వీసాల విష­యంలో గానీ, డిపో­ర్టే­షన్‌ విష­యంలో గానీ, రెసి­ప్రొ­కల్‌ టారి­ఫ్‌ల విష­యంలో గానీ మన­వా­ళ్లకు ఎలాంటి ఊరట లభిం­చనే లేదు. అమె­రి­కాలో భారీ సంఖ్యలో ఉన్న భార­తీయ విద్యా­ర్థులు, వృత్తి నిపు­ణులు ఇప్పుడు క్షణ­మొక యుగంగా గడు­పు­తు­న్నారు. ప్రధాని మోదీ అమె­రికా పర్య­టన నేప­థ్యంలో తమకు ఏమైనా ఊరట కలు­గు­తుం­దే­మో­నని వాళ్లంతా వెయ్యి కళ్లతో వేచి చూశారు. కానీ వారి కల­లన్నీ కల్లలే అయి­పో­యాయి. ఈసారి పర్య­ట­నల కేవలం పైపై మాటలే తప్ప.. చేతలపరంగా సాధిం­చింది దాదా­పుగా ఏమీ లేదనే విమర్శ గట్టి­గానే విని­పి­స్తోంది. ముఖ్యంగా రెసి­ప్రో­కల్‌ టారి­ఫ్‌లు ప్రపం­చ­ప­టంపై ట్రంప్‌ సృష్టిం­చ­నున్న ఒక విష వల­యంగా ట్రేడ్‌ నిపు­ణులు అభి­ప్రా­య­ప­డు­తు­న్నారు.
అస­లే­మిటీ రెసి­ప్రొ­కల్‌ టారి­ఫ్‌లు
వేరే దేశాల నుంచి అమె­రికా దిగు­మతి చేసు­కునే వస్తు­వుల మీద పడే పన్నులే టారి­ఫ్‌లు. వేరే దేశాలు తమ వస్తు­వు­లను ఎగు­మతి చేసే­ట­ప్పుడు ఎంత మొత్తం పన్నులు వేస్తు­న్నాయో, తాము కూడా తమ వస్తు­వు­లను ఆయా దేశా­లకు పంపే­ట­ప్పుడు అంతే మొత్తం పన్నులు వేయా­ల­న్నది రెసి­ప్రొ­కల్‌ టారిఫ్‌ విధానం. పచ్చిగా చెప్పా­లంటే.. పంటికి పన్ను, కంటికి కన్ను అన్న­ట్లుగా.. వాళ్లెంత వేస్తు­న్నారో, మనమూ అంతే పన్ను వేయాలి అన్నదే ఈ విధానం. అవ­తలి దేశం తమకు మిత్ర దేశమా, శత్రు­దే­శమా అన్న దాంతో ఏమాత్రం సంబంధం లేదు. వ్యూహా­త్మక ప్రత్య­ర్థు­లైన చైనా లాంటి దేశా­లకు గానీ, తమ మిత్ర దేశా­లైన భారత్‌, యూరో­పి­యన్‌ యూని­యన్‌, జపాన్‌, కొరి­యా­లకు గానీ కూడా అదే సూత్రం వర్తిం­ప­జే­స్తు­న్నారు. ఏ దేశా­నికి ఎంత పన్ను అనేది వాళ్లు విధి­స్తున్న పన్ను­లను బట్టే ఉంటుంది.
మనపై ప్రభావం ఎలా ఉంటుంది?
ఇతర దేశాలు అన్నిం­టి­కంటే భార­త­దేశం అమె­రికా వస్తు­వు­లపై విధి­స్తున్న పన్నులు చాలా ఎక్కు­వగా ఉన్నా­యని.. ఆ మాట­కొస్తే అసలు భార­త­దే­శాన్ని పన్నుల రారా­జుగా అభి­వ­ర్ణిం­చొ­చ్చని ట్రంప్‌ తరచు అంటు­న్నారు. తాజాగా ఇటీ­వలే టారిఫ్‌ ఆర్డర్‌ మీద సంతకం చేసే సమ­యంలో కూడా ఆయన ఇదే వ్యాఖ్య చేశారు. తాను మొద­టి­సారి అధ్య­క్షు­డై­న­ప్పుడు కూడా ఈ పన్నుల విష­యాన్ని భారత ప్రధా­నితో చర్చిం­చా­నని, కానీ వాళ్ల నుంచి తమకు ఎలాంటి మిన­హా­యిం­పులు రాలే­దని ఆయన అన్నారు. అందుకే.. భార­త­దే­శా­నికి కూడా తాము రెసి­ప్రొ­కల్‌ టారిఫ్‌ విధా­నాన్నే అవ­లం­బి­స్తా­మని స్పష్టం చేశారు. అంటే.. మనం ఎంత పన్ను వేస్తు­న్నామో మనకూ అంతే పన్ను పడు­తుం­దని కుండ బద్ద­లు­కొ­ట్టే­శారు. కానీ… అమె­రి­కా­లోని కుబే­రు­లతో పోలిస్తే ఇక్క­డి­ నుంచి ఎగు­మతి చేసే చిన్న­త­రహా వ్యాపా­రుల మీద ఆ పన్ను భారం ఎంత పడు­తుందో అటు ట్రంప్‌కు, ఇటు నరేం­ద్ర­ మో­దీకి తెలి­యని సంగతి కాదు. ఎలాన్‌ మస్క్ లాంటి ప్రపంచ కుబే­రు­లకు కొద్ది­పాటి పన్ను పడి­నంత మాత్రాన నష్టం ఏమీ రాదు. కానీ, భార­త­దేశం నుంచి లేస్లు, వస్త్రాలు, యంత్రాలు, మందులు, బియ్యం, సుగంధ ద్రవ్యాలు, తోలు వస్తు­వులు, వ్యవ­సా­యో­త్ప­త్తులు.. ఇవే ఎక్కు­వగా ఎగు­మతి చేస్తారు. ఇవన్నీ పంపేది సామాన్య, చిన్న­త­రహా వ్యాపా­రులే. వారు ఎగు­మతి చేసే ఇలాంటి వస్తు­వుల మీద పన్నులు అధి­కంగా విధిస్తే సహ­జం­గానే వాటి ధర అక్కడ పెరు­గు­తుంది, అప్పుడు వాటికి డిమాండు తగ్గు­తుంది. ఫలి­తంగా మన దేశం నుంచి అక్క­డకు చేసే ఎగు­మ­తులు తగ్గి­పో­తాయి. ఏప్రిల్‌ రెండో తేదీ నుంచే ఈ రెసి­ప్రొ­కల్‌ టారి­ఫ్‌లు అమ­లయ్యే అవ­కాశం స్పష్టంగా కని­పి­స్తోంది.
అస­లెం­దుకు తీసు­కొ­స్తు­న్నారు?
డొనాల్డ్​‍ ట్రంప్‌ రెండో­సారి అధి­కా­రం­లోకి వచ్చిన సమ­యా­నికే అక్కడ విప­రీ­త­మైన ఆర్థి­క­మాంద్యం ముంగిట సిద్ధంగా ఉంది. నిరు­ద్యోగం పెరి­గి­పో­తోంది. ఆర్టి­ఫి­షి­యల్‌ ఇంటె­లి­జెన్స్​‍ ప్రభా­వమో.. మరేమో గానీ చాలా పెద్ద పెద్ద సంస్థలు కూడా ఉద్యో­గు­లను లే ఆఫ్‌ పేరుతో తొల­గి­స్తు­న్నా యి. దీంతో అమె­రికా ప్రజల్లో తీవ్ర­మైన అల­జడి నెల­కొంది. ఆర్థిక మాంద్యం ఏర్ప­డితే మొత్తం మార్కెట్‌ వ్యవస్థే అస్త­వ్యస్తం అవు­తుంది. అందుకే, దాన్నుంచి బయ­ట­ప­డా­లన్న ఉద్దే­శంతో పన్నుల రూపంలో ఆదాయం పెంచు­కు­నేం­దుకు ట్రంప్‌ ఈ ఆలో­చన చేసి­నట్లు కని­పి­స్తోంది. తాను అధి­కా­రం­లోకి రాగానే.. ప్రజల మను­సులు దోచు­కో­వా­లన్న ఉద్దే­శంతో అమె­రి­క­న్లం­ద­రికీ ఆదా­య­పన్ను తీసే­స్తు­న్నట్లు చెప్పారు. దాంతో ప్రభు­త్వా­నికి వచ్చే ఆదాయం చాలా­వ­రకు తగ్గి­పో­నుంది. దాన్ని పూడ్చు­కో­వా­లంటే ఏదో ఒకటి కావా­లని ఆలో­చించి మరీ.. ఇలా అన్ని దేశాల మీద తన ఆర్థి­క­మాం­ద్యాన్ని రుద్దే ప్రయత్నం చేస్తు­న్నారు. కానీ, ఇదంతా ఒక విష­వ­ల­యంగా మారు­తుంది. క్రమంగా అదే ఆర్థిక మాంద్యం అన్ని దేశా­లనూ ఆవ­హించే ప్రమాదం పొంచి ఉంటుంది. ఎందు­కంటే, అమె­రికా నుంచి మనం దిగు­మతి చేసు­కు­నే­వాటి మాట ఎలా ఉన్నా, అక్క­డకు ఎగు­మతి చేయడం ద్వారా కొన్ని రంగా­లకు బోలె­డంత మార్కెట్‌ లభి­స్తుంది. అదంతా ఇప్పుడు మంద­గి­స్తుంది. ముఖ్యంగా మన దేశం నుంచి మందుల ఎగు­మ­తులు అమె­రి­కాకు చాలా పెద్ద­మొ­త్తంలో జరు­గు­తాయి. అలాగే వ్యవ­సా­యో­త్ప­త్తులు, సుగంధ ద్రవ్యాలు కూడా. వస్త్ర ఉత్ప­త్తులు కూడా తీవ్రంగా ప్రభా­వితం అవు­తాయి. ఇక ఇప్ప­టికే సేవా­రం­గంలో తీవ్ర­మైన ఒడి­దు­డు­కులు కని­పి­స్తు­న్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‍­వేర్‌ ఉద్యో­గాలు ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు ఊడ­తాయో తెలి­యని పరి­స్థితి ఉండ­డంతో అక్క­డు­న్న భా­ర­తీయ యువత తీవ్ర అని­శ్చి­తిలో ఉన్నారు. హెచ్‌1బీ వీసాల రెన్యు­వల్‌ విష­యంలో సైతం ట్రంప్‌ యంత్రాంగం పెడు­తున్న అర్థం లేని నిబం­ధ­నల వల్ల భార­తీ­యులే ఎక్కు­వగా ప్రభా­వితం అవు­తు­న్నారు. అసలు ఇప్ప­టికే దేశాల వారీ కోటా విధిం­చడం వల్ల మన­వాళ్లు హెచ్‌1బీ వీసాలు దొరక్క అవ­స్థలు పడు­తుంటే, ఇప్పుడు డ్రాప్‌ బాక్స్​​‍ రెన్యు­వల్స్​‍ విష­యం­లోనూ కొత్త నిబం­ధ­నలు పెడుతూ, మన­వాళ్ల ముందరి కాళ్లకు బంధాలు వేస్తు­న్నారు.
మాగా.. మిగా రెండూ ఒకే­సారి ఎలా సాధ్యం?
మేక్‌ అమె­రికా గ్రేట్‌ ఎగైన్‌ (మాగా) అని ట్రంప్‌ అంటుంటే.. అచ్చం అలాగే మేక్‌ ఇండియా గ్రేట్‌ ఎగైన్‌ (మిగా) చేస్తా­మని నరేం­ద్ర­మోదీ అమె­రి­కాలో తన మిత్రు­డితో పాటు కలిసి నిర్వ­హిం­చిన సంయుక్త విలే­క­రుల సమా­వే­శంలో చెప్పారు. కానీ అసలు ఈ రెండూ ఒకే ఒరలో ఇరి­కిం­చా­ల­ను­కుం­టున్న రెండు కత్తు­ల్లాం­టి­వన్న విషయం మోదీకి తెలి­యదా? ఏదో ఒక కత్తి మాత్రమే ఒక ఒరలో దూరు­తుంది. రెండు దేశాల ప్రయో­జ­నాలూ ఒకే­సారి గెల­వడం దాదా­పుగా సాధ్యం కానే కాదు. అయినా ఎవరి చెవుల్లో పూలు పెట్ట­డా­నికి ఇలా చెబు­తు­న్నారో మోదీకే అర్థం కావాలి. ఎల్ల­కాలం అంద­రినీ మోసం చేయడం సాధ్యం కాదు. కొంత­కాలం కొంత­మం­దినే మోసం చేయ­గ­ల­రని అంటారు. కానీ ప్రస్తుతం అమె­రికా పర్య­ట­నలో మోదీ చెబు­తున్న మాటలు చూస్తుంటే మాత్రం భార­తీ­యుల్లో చాలా­మం­దికి అను­మా­నాలే వస్తు­న్నాయి.
అమె­రి­కాకు ప్రయో­జనం ఉంటుందా?
కొత్తగా విధి­స్తున్న, విధిం­చా­ల­ను­కుం­టున్న రెసి­ప్రొ­కల్‌ టారి­ఫ్‌ల వల్ల పోనీ అమె­రి­కాకు ఏమైనా ఆర్థిక ప్రయో­జ­నాలు నెర­వే­రు­తాయా అంటే.. అదీ అను­మా­న­మే­నని ఆర్థిక నిపు­ణులు అంటు­న్నారు. వీటి­వల్ల అక్కడ ద్రవ్యో­ల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉందని వాల్‌­స్ట్రీట్‌ ఆందో­ళన వ్యక్తం చేస్తోంది. దాని­వల్ల ఫెడ­రల్‌ రిజర్వ్ ఇకపై వడ్డీ రేట్లు తగ్గించే అవ­కాశం ఉండదు. ఆర్థిక వృద్ధి మంద­గ­మ­నంలో వెళ్తుంది. కొత్తగా వాణి­జ్య­ప­ర­మైన చర్యలు ఏమీ లేక­పో­వ­డంతో అంత­ర్జా­తీయ మార్కె­ట్ల­పైనా ప్రభావం పడు­తుం­దని ఆ దేశ ఆర్థిక నిపు­ణులు హెచ్చ­రి­స్తు­న్నారు. రెసి­ప్రొ­కల్‌ టారి­ఫ్‌లు ఇప్ప­టి­కి­ప్పుడే విధిం­చ­క­పో­వడం వల్ల అంత­ర్జా­తీయ మార్కె­ట్లకు కొంత ఊర ట లభిం­చ­వచ్చు గానీ.. అవి అమ­లైన తర్వాత ప్రభా­వాలు మాత్రం చాలా దారు­ణంగా ఉంటా­యని బార్‌­క్లేస్ సంస్థ­లోని విశ్లే­ష­కులు కూడా ఆందో­ళన వ్యక్తం చేశారు.
ఇద్దరి మధ్య అసలేం జరి­గింది?
మోదీ, ట్రంప్‌ మధ్య ప్రధా­నంగా వాణిజ్యం, భద్రత సహా పలు ఇతర అంశా­లపై చర్చలు జరి­గాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు భర్తీ చేసేలా అమె­రికా నుంచి మరింత చమురు, గ్యాస్ కొను­గోలు చేసేలా ఒప్పందం కుది­రింది. ట్రంప్‌ మొదటి టర్మ్ కంటే ఇప్పుడు రెండిం­తల వేగంతో తామి­ద్దరం కలిసి పని­చే­స్తా­మని మోదీ వ్యాఖ్యా­నిం­చారు. ట్రంప్‌ కూడా మోదీపై ప్రశం­సలు కురి­పిం­చారు. మోదీ అద్భు­తంగా పని­చే­స్తు­న్నారు, అందరూ ఆ విష­యమే మాట్లా­డు­కుం­టు­న్నారు. మోదీ నిజంగా గొప్ప నాయ­కుడు అని ట్రంప్‌ అన్నారు. టారిఫ్స్​‍ గురించి అడి­గిన ప్రశ్నకు డోనల్డ్​‍ ట్రంప్‌ బదు­లి­చ్చారు. అది భారత్‌ అయినా లేదా మరో దేశ­మైనా పన్నులు వసూలు చేస్తా­మని ట్రంప్‌ అన్నారు. మాకు పన్నులు వేసి­నట్లే మేం కూడా వారికి పన్నులు విధిస్తాం. ఇది అమె­రికా పరి­పా­లనా విధానం. పర­స్పర సుంకా­లను వర్తిం­ప­జేస్తాం. భారత్‌ మా నుంచి ఎంత వసూలు చేస్తుందో, మేం కూడా వారి నుంచే అంతే వసూలు చేస్తాం అని ట్రంప్‌ స్పష్టం చేశారు. ఇక అమె­రికా నుంచి భార­తీ­యుల డిపో­ర్టే­షన్‌ అంశా­నికి తాను మద్దతు పలు­కు­తు­న్నట్లు మోదీ చెప్పు­కొ­చ్చారు.
ఇదంతా చూస్తుంటే.. అమె­రికా నుంచి భార­త­దే­శా­నికి దిగు­మ­తులు ఇక చాలా ఎక్కు­వగా ఉండ­బో­తు­న్నా­యని, మన మార్కె­ట్‌ను అమె­రికా కొల్ల­గొ­ట్ట­బో­తోం­దని అర్థ­మ­వు­తుంది. ఎంత షుగర్‌ కోటింగ్‌ వేసి ఇచ్చినా.. చేదు మందు చేదు ­మందే అవు­తుం­దన్న విషయం అంద­రికీ తెలుసు. అమె­రికా నుంచి భారీ­స్థా­యిలో చమురు, ఇతర ఉత్ప­త్తులు మన దేశం మీద వచ్చి పడ్డా­యంటే సహ­జం­గానే వాటి ధరలు పెరి­గి­పో­తాయి. ఇంత­కు­ముందు ఉక్రె­యిన్‌ మీద యుద్ధం నేప­థ్యంలో రష్యా నుంచి చమురు కొను­గో­ళ్లను చాలా దేశాలు తగ్గిం­చే­శాయి. అయితే, ఆ దేశంతో మన­కున్న సత్సం­బం­ధాల దృష్ట్యా మనం తక్కువ ధరకే రష్యా ­నుంచి చమురు దిగు­మతి చేసు­కో­గ­లిగాం. ఆ ప్రయో­జనం ప్రజల వరకు చేర­క­పో­యినా.. ప్రభు­త్వా­నికి మాత్రం చాలానే మిగి­లింది. గల్ఫ్ దేశాల నుంచి చమురు దిగు­మతి చేసు­కు­న్న­ప్పటి కంటే తక్కువ ధర పడ­డంతో ఖజానా బాగా బల­ప­డింది. కానీ ఇప్పుడు అమె­రికా లాంటి అగ్ర­రా­జ్యాల నుంచి దిగు­మతి చేసు­కుంటే మళ్లీ చము­రు ధ­రలు పెరు­గు­తాయి. తగ్గి­న­ప్పుడు తగ్గింపు ప్రయో­జ­నా­లను ప్రజ­లకు అందించే ప్రయత్నం ఏమాత్రం చేయని కేంద్ర ప్రభుత్వం.. అవి పెరి­గితే మాత్రం వెంటనే పెంచే­స్తుం­ద­న­డంలో ఏమాత్రం సందేహం అక్క­ర్లేదు.
గుడ్డిలో మెల్ల.. ఎఫ్‌35 డీల్‌
అమె­రి­కాలో తయా­రు ­చే­సిన అత్యా­ధు­నిక యుద్ధ­వి­మానం ఎఫ్‌35లను భార­త­దే­శా­నికి అమ్మ­జూ­పడం, అందుకు ఒక ఒప్పందం కూడా చేసు­కో­వడం మాత్రం ఈ పర్య­టన మొత్త­మ్మీద సాధిం­చిన అతి­పెద్ద విజయం అని చెప్పు­కోక తప్పదు. లాక్‌­హీడ్‌ మార్టిన్‌ సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఈ యుద్ధ­ వి­మానం వివిధ సెన్సర్ల ద్వారా అందే సమా­చా­రాన్ని కలిపి విశ్లే­షించి పైల­ట్‌కు కచ్చి­త­మైన సమా­చారం, సూచ­నలు అంది­స్తుంది. ఇతర విమా­నాలు, నేల­మీద ఉండే రాడార్ల నుంచి సమా­చా­రాన్ని సేక­రించి, వాటికి సమా­చారం ఇస్తుంది. శత్రు రాడా­ర్లను సుల­భంగా తప్పు­దోవ పట్టించి, అక్కడ ఎగు­రు­తు­న్నది ఏదో ఒక చిన్న కీటకం అనే భ్రమ కలి­గిం­చ­గ­లదు. అంతే­కాదు.. అసలు తనతో అను­సం­ధా­న­మైన ఆయు­ధా­లన్నీ కూడా తన సొంత శక్తి­సా­మ­ర్థ్యా­లకు మించి శత్రు­వుపై దాడి చేసేలా ఇది తోడ్ప­డ­గ­లదు. ఎఫ్‌35 అనేది అయిదో తరం స్టెల్త్ విమానం. అయిదో తరం విమాన టెక్నా­ల­జీల్లో భారత్‌ బాగా వెను­క­బడి ఉందని, ఇది దేశ భద్ర­తకు అంత మంచిది కాదని రక్ష­ణ­రంగ నిపు­ణుల నుంచి తరచు ఆందో­ళన వ్యక్త­మ­వు­తోంది. వీటి విష­యంలో ఇప్ప­టికే చైనా ముందుకు దూసు­కు­వె­ళు­తోంది. వీటిని తాము చైనా నుంచి కొంటా­మని పాకి­స్థాన్‌ కూడా ఈమధ్యే ప్రక­టిం­చింది. ప్రస్తుతం మన వద్ద మూడో తరం, నాలు­గో­తరం, లేదా మహా అయితే 4.5 తరం యుద్ధ విమా­నాలు మాత్రమే ఉన్నాయి. పక్కలో బల్లెం పెట్టు­కు­న్నట్లు ఇటు చైనా, అటు పాకి­స్థాన్‌ దేశా­లతో కయ్యం ఉండి మనం వైమా­నిక రంగంలో అంత వెన­క­బా­టులో ఉంటే చాలా ప్రమా­దమే. అలాంటి తరు­ణంలో మనకు ఆర్థి­కంగా భారం అవు­తున్నా కూడా ఎఫ్‌35 విమా­నాలు రావడం అనేది గొప్ప విజ­యమే అవు­తుంది. ఐదో తరం స్టెల్త్ విమా­నా­లను తయా­రు­ చే­సేం­దుకు స్వదేశీ పరి­జ్ఞా­నాన్ని కూడా భార­త­దేశం అంది­పు­చ్చు­కుం­టోంది. కానీ, ఇందుకు చాలా సమయం పడు­తుంది. ఇప్పుడు చేస్తున్న ప్రయ­త్నా­లన్నీ వేగ­వంతం అయి­తేనే 2036 నాటికి తొలి విమానం అందు­తుంది. ఇలాంటి తరు­ణంలో ఎఫ్‌35 లాంటి అత్యా­ధు­నిక యుద్ధ విమానం మనకు అందడం చాలా ప్రయో­జనం చేకూ­రు­స్తుంది.
ఇదేం వ్యక్తి­గతం..?
ఆదా­నీపై అమె­రి­కాలో వస్తున్న అవి­నీతి ఆరో­ప­ణల విష­యంలో మోదీని ఓ విలే­కరి సూటి­గానే ప్రశ్నిం­చాడు. దీనికి స్పందిం­చిన మోదీ ఇది మొత్తం ఆదా­నికి సంబం­ధిం­చిన వ్యక్తి­గ­త­మైన విషయం అని తప్పిం­చు­కు­న్నారు. దేశంలో ప్రముఖ వ్యాపా­ర­వేత్త మరో దేశంలో తీవ్ర­మైన అవి­నీతి ఆరో­ప­ణలు ఎదు­ర్కొ­న్న­ప్పుడు అవి ఆ వ్యాపా­ర­వే­త్తకు సంబం­ధిం­చిన వ్యక్తి­గ­త­మై­నవి ఎలా అవు­తాయో మోదీకే తెలి­యాలి. తన పార్టీతో పాటూ తను కూడా ఆదానీ ఎదు­గు­ద­లకు పూర్తి స్థాయిలో సహ­క­రి­స్తు­న్నా­రన్న ప్రతి­ప­క్షాల విమ­ర్శలు ఒక వైపు నుంచి వస్తు­న్నాయి. రాహుల్‌ గాంధీ పార్ల­మెంటు వేదిక నుంచి ఈ రకంగా ఆరో­ప­ణలు చేశారు. ఇలాంటి సమ­యంలో మోదీ ఈ విధంగా ఆదాని గురించి మాట్లా­డటం ద్వారా దేశ ప్రజ­లకు ఏమి సందేశం పంపా­ల­ను­కుం­టు­న్నారో అంతు­బ­ట్టడం లేదు. పిల్లి కళ్ళు­మూ­సు­కుని పాలు తాగుతూ ప్రపంచం మొత్తం కళ్ళు మూ­సు­కు­న్నది అను­కు­న్న­ట్టుగా ఉంది ఈ అంశం. మోదీ ప్రధా­న­మంత్రి అయిన తరు­వా­తనే ఆదానీ బిజి­నెస్ గ్రాఫ్‌ పెరి­గి­పో­యిన విష­యం ప్రతి ఒక్క­రికీ తెలుసు.
ఈ పర్య­ట­నలో మరో గమ్మత్తు కూడా జరి­గింది. మోదీ నాకు వ్యక్తి­గత మిత్రుడు అంటూ ట్రంప్‌ బహి­రం­గం­గానే ప్రక­టిం­చారు. ఇదేదో బాగుం­దని అమె­రి­కాలో నివ­సి­స్తున్న భార­తీయ సంతతి సంతో­షిం­చింది. మిత్రుడు అడి­గితే మరో మిత్రుడు సహ­క­రిం­చ­క­పో­తాడా అని అంతా అను­కు­న్నారు. కానీ ఆ మరు­సటి రోజే మిత్ర­దే­శ­మైన, శత్రు­దే­శ­మైన తాము త్వరలో అమలు చేయ­నున్న రెసి­ప్రొ­కల్‌ టారి­ఫ్‌ల విష­యంలో ఎటు­వంటి మార్పులు ఉండ­బో­వని స్పష్టం చేశారు. ఇక తాను స్వయంగా రాసిన ‘‘అవర్‌ జర్నీ టుగె­దర్‌’’ అనే పుస్త­కాన్ని మోదీకి అందించి ట్రంప్‌ చేతు­లు దు­లు­పు­కు­న్నారు.
ఈ పర్యటన ఓన్లీ పర్సనల్‌
ఫిబ్ర­వరి 2025 వరకూ ప్రధాని మోదీ చేప­ట్టిన విదేశీ పర్య­ట­నల సంఖ్య అక్ష­రాల 85. ఇందులో 73 దేశా­లను ఆయన చుట్టి వచ్చారు. ఈ దఫా అమె­రికా పర్య­ట­న­పైనే విమ­ర్శలు వస్తు­న్నాయి. ట్రంప్‌ అమె­రికా అధ్య­క్షు­డిగా రెండవసారి ఎన్ని­కైన తరు­వాత మోదీ అమె­రికా పర్య­ట­నకు వెళ్లారు. అయితే అప్ప­టికే ట్రంప్‌ ఆయన చేప­ట్ట­నున్న సంస్క­ర­ణల గురించి బహి­రం­గం­గానే ప్రక­టిం­చారు. చట్ట­ప­రంగా ఆయా ప్రక­ట­న­లకు తుది రూపు ఇవ్వాల్సి ఉంది. ఈ సారి ట్రంప్‌ కేవలం అమె­రి­కాను మాత్రమే ఒక యూని­ట్‌గా తీసు­కుని అన్ని రకాల ప్రణా­ళి­కలు రూపొం­దిం­చు­కు­న్నారు. అమె­రి­కన్‌ ఫస్ట్ అనే నినా­దం­తోనే ముందుకు వెళు­తు­న్నారు. ముఖ్యంగా ఆర్థిక పర­మైన సంస్క­ర­ణలు, విదేశీ వాణి­జ్యంపై ఆయన అనేక మార్పు­లకు శ్రీకారం చుట్టారు. ఇవన్నీ అమ­లయ్యే సమ­యంలో భారత ప్రధాని మోదీ అమె­రికా పర్య­టన ప్రపం­చ­ దే­శా­లను ఒకింత ఆశ్చ­ర్యానికి గురి­చే­సింది. ట్రంప్‌ మోదీ మధ్య కుద­రిన సయో­ధ్యే­మైనా ట్రంప్‌ ఆలో­చనా ధోర­ణిలో మార్పులు తీసు­కుని వస్తుం­దే­మో­నని అంతా ఎదు­రు­చూ­శారు. కానీ ఈ దఫా మోదీ విదేశీ పర్య­టన దేశా­నికి పెద్దగా ఏమీ ప్రయో­జనం కల్గిం­చ­లే­క­పో­యిం­దనే విమ­ర్శలు వస్తు­న్నాయి. అలాగే ప్రపంచ దేశాల ఆశలు కూడా ఆవి­ర­య్యాయి.

- Advertisement -

‘సమయం’ కాలం బై సమయమంత్రి చంద్రశేఖర శర్మ, 98858 09432

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News