Tuesday, May 21, 2024
Homeఇంటర్నేషనల్KTR with NRIs: 52 దేశాల్లోని ఎన్ఆర్ఐలతో కేటీఆర్ ముచ్చట

KTR with NRIs: 52 దేశాల్లోని ఎన్ఆర్ఐలతో కేటీఆర్ ముచ్చట

సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దే హవా

రేపు ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాల్లో ఉన్న బీఅరెస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్, హాజరు కానున్న బీఅరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మహేష్ బిగాల.

- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాల్లో ఉన్న బీఅరెస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ కు (28 న భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 05:00 గంటలకు) బీఅరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు రావు హాజరు కానున్నారని బీఅరెస్ ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. ఈ సందర్భంగా మహేష్‌ బిగాల మాట్లాడుతూ తెలంగాణ‌లో ఎన్నిక‌ల న‌గారా మోగింది, రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు న‌వంబ‌ర్ 30వ తేదీన పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు, ఈ సందర్బంగా 2018 లో విస్తృతంగా ఎన్నారైలు ప్రచారాన్ని నిర్వహించామని అలాగే ఈసారి కూడా ఈ ఎన్నికలలో అటు సోషల్ మీడియా కాంపెయిన్ తో పేరు ప్రత్యక్షంగా కొన్ని నియోజక వర్గాలలో ఎన్నారైలు పర్యటించి కెసిఆర్ ప్రభుత్వం చేపట్టుతున్న సంక్షేమ పథకాలు వివరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఅరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు రావు గారు ఎన్నారైలని ఉద్దేశించి మాట్లాడుతారని రాబోయే ఎన్నికల ప్రచారంలో ఎన్నారైల పాత్ర ఎలా ఉండాలి అనే దానిపై దిశా నిర్దేశం చేస్తారని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News