Monday, June 23, 2025
Homeఇంటర్నేషనల్Petrol Price hike: పెట్రోలు ధరలు పెరగనున్నాయి.. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో భగ భగ!

Petrol Price hike: పెట్రోలు ధరలు పెరగనున్నాయి.. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో భగ భగ!

Petrol Price hike due to Iran Decision: రానున్న రోజుల్లో భారత్‌లో పెట్రోల్‌ ధరలు భారీగా పెరగనున్నాయి. మిడిల్‌ ఈస్ట్‌లో ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్‌ తన దాడులను కొనసాగిస్తుండటం ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇటువంటి ఆందోళనల మధ్య సోమవారం అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు స్వల్పంగా పెరిగి ఐదు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. దీనికి కారం రోజుకు 3.3 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తితో ఇరాన్ ప్రపంచంలోనే తొమ్మిదవ అతిపెద్ద చమురుని ఉత్పత్తి దేశంగా ఉండటమే కారణం. ప్రస్తుతం ఆ దేశంపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతుండటంతో పెట్రో ధరలు మరింత ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది.

కారణం ఏంటంటే? ముఖ్యంగా ఇరాన్‌ రాజధాని టెహ్రాన్ నుంచి ఈ పెట్రో ఎగుమతులు సగానికి పైనే ఉంటాయి. మిగిలిన ప్రాంతం నుంచి మిగిలిన ఇంధనం ఇతర దేశాలకు ఇరాన్‌ తరలిస్తుంది. అయితే ప్రపంచంలోనే 5 అతిపెద్ద హోర్ముజ్ జలసంధి టెహ్రాన్‌లో ఉంది. దీనిని మూసివేయాలని ఇప్పటికే ఆ దేశ పార్లమెంట్‌ నిర్ణయించింది. దీంతో చమురు ధరలు 2 శాతానికి పైగా పెరనున్నాయి. ఇది ఈ ఏడాది జనవరి తర్వాత అత్యధికం కావడం గమనార్హం. ఇంకా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కి 2.7 శాతం పెరుగుదలతో 79.12 డాలర్లకు పెరిగింది.

ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులకు టెహ్రాన్ ప్రతీకారం తీర్చుకుంటుందన్న అభిప్రాయంతో ఇప్పటికే ఆసియా స్టాక్స్ కుప్పకూలాయి. అంతే కాకుండా మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలను సైతం ఇరాన్ బెదిరించింది. దీంతో పరిస్థితి మరోలా మారే అవకాశం కూడా ఉంది. ఇక ఐరోపా మరియు జపాన్ చమురు దిగుమతులపై ఎక్కువ ఆధారపడి ఉన్నాయి. అయితే అమెరికా మాత్రం నికర ఎగుమతిదారుగా ఉండటం విశేషం. పరిస్థితి అదుపులోకి రాకుంటే పెట్రో మంట తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ముఖ్యంగా 33 కిలోమీటర్ల (21 మైళ్ళు) వెడల్పు మాత్రమే ఉన్న హోర్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ నిర్ణయించుకోవడంతో అమెరికాపై దీనిపై ప్రతీకారం తీర్చుకుంటుందనే భయాందోళనల మధ్య మార్కెట్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఎందుకంటే ఇది ప్రపంచ చమురు వాణిజ్యంలో పావు వంతు మరియు 20 శాతం LNG (సహజ వాయువు) సరఫరా కొనసాగుతుంది.

ఇప్పటికే ఎన్నోసార్లు ఈ జలసంధిని మూసివేస్తామని టెహ్రాన్ హెచ్చరించినప్పటికీ.. ఒక్కసారి కూడా దీనిని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కానీ అమెరికా చర్య కారణంగా ఇరాన్ పార్లమెంటు జలసంధినిని మూసివేసే చర్యను ఆమోదించిందని ఇరాన్ ప్రెస్ నివేదించింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News