ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన(Flight Accident) ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అమ్మఅహ్మదాబాద్లోని మేఘాని గుజ్సెల్ విమానాశ్రయ సమీపంలో ఎయిరిండియా సంస్థకు చెందిన విమానం కూలింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే చెట్టును ఢీకొట్టి కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమాయంలో సుమారు 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్నలు సమాచారం. సమాచారం అందుకున్న ఎయిర్ పోర్టు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆస్తి, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. అదే ఫ్లైట్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానితో పాటు పలువురు ముఖ్య నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా, విజయ్ రూపానికి తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హుటాహుటిన గుజరాత్కు బయల్దేరారు. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ తో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.