Wednesday, June 25, 2025
Homeనేషనల్Bomb Threat to Indigo Flight: విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్!

Bomb Threat to Indigo Flight: విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్!

Bomb Threat to Indigo Flight: విమానాలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా మస్కట్​ నుంచి దిల్లీ వెళ్తున్న ఇండిగో ఫ్లైట్‌కి ఆగంతకులు బాంబు బెదిరింపు కాల్ చేశారు. దీంతో అప్రమత్తమైన ఇండిగో సిబ్బంది విమానాన్ని నాగ్​పుర్​ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి నిలిపివేశారు.
మంగళవారం 6E 2706 నంబర్‌ గల ఇండిగో విమానం మస్కట్​ నుంచి కొచ్చికి వచ్చింది. ఆత తర్వాత కొద్ది సేపటికే దిల్లీకి వెళ్లేందుకు టేకాఫ్​ కూడా అయ్యింది. అయితే ఇదే సమయంలో ఈ విమానం నంబర్​ను చూపిస్తూ ఇండిగో అధికారిక మెయిల్‌కి ఓ బెదిరింపు మెసెజ్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఇండిగో సిబ్బంది పైలట్‌కి సమాచారం అందించి విమానాన్ని నాగ్​పుర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా ఆదేశాలు ఇచ్చారు.

ఆ వెంటనే విమానంలోని ప్రయాణికులందరినీ కిందకి దించేసి విమానాన్ని బాంబు స్క్వాడ్‌ బృందంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఈ తనిఖీల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు కానీ అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తేల్చి చెప్పారు. అయితే ఇదే విమానంలో ఆరుగురు సిబ్బంది సహా 157 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు.

- Advertisement -

ఇక మరోవైపు అహ్మదాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమాన సర్వీసును రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా స్పష్టం చేసింది. అయితే ఈ విమానం లండన్‌కి వెళ్లాల్సిన ఫ్లైట్‌ తర్వాత బయలుదేరుతుండటం గమనార్హం. ఈ మధ్య విమానాలకు ప్రమాద హెచ్చరికలు, సాంకేతిక లోపాల సమస్య కలవరానికి గురిచేస్తోంది.

కేంద్ర విమానయాన శాఖ సైతం ప్రయాణీకుల సేఫ్టీకి అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. బోయింగ్‌ విమానం ప్రమాదం తర్వాత ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో ప్రయాణీకులకు సైతం అవేర్‌నెస్‌ నిర్వహిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో రోజుకు 6 వేలకు డొమెస్టిక్‌ సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. భారత్‌లో గత రెండేళ్లుగా ఎయిర్‌ట్రాఫిక్‌ కూడా బాగా పెరిగింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News