Sunday, October 6, 2024
Homeనేషనల్Delhi: బీఆర్ఎస్ పార్టీ భవన నిర్మాణ పనుల సమీక్ష

Delhi: బీఆర్ఎస్ పార్టీ భవన నిర్మాణ పనుల సమీక్ష

ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.

- Advertisement -

నిర్మాణ ప్రాంగణం కలియ తిరిగి, క్షేత్ర స్థాయిలో పనులను వేముల పర్యవేక్షించారు. పనుల పురోగతిపై ఆర్కిటెక్ట్, వర్క్ ఏజెన్సీతో ఆయన సమీక్ష నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను మంత్రి అదేశించారు. మంత్రి వెంట ఉర్దూ అకాడెమీ ఛైర్మన్ ముజీబుద్దిన్, ఆర్కిటెక్ట్ ఆస్కార్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని అట్టహాసంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News