బాలీవుడ్ నటి కంగన రనౌత్ లోక్ సభ బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈమేరకు బీజేపీ కంగనకు టికెట్ కేటాయించింది. కంగన తన సొంత స్థానమైన హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి పోటీ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఆమె బీజేపీకి మద్దతుగా, ముఖ్యంగా మోడీకి వీరాభిమానిగా పదేపదే వ్యాఖ్యానిస్తూ, ట్వీట్లు చేస్తూవస్తున్నారు. తనకు రాజకీయాలంటే ఆసక్తి ఎక్కువగా ఉందని, పోటీకి సైతం సిద్ధమని ఆమె ప్రకటించారు.