మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో మరోసారి భారీ అగ్నిప్రమాదం(Fire accident) సంభవించింది. సెక్టార్ 22లో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున టెంట్లు తగలబడుతున్నాయి. మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు పోలీసులు భక్తులను శిబిరాల నుంచి వేరే చోటకి తరలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మానవ తప్పిదమా? లేక ప్రమాదవశాత్తూ జరిగిందా..? దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా..? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బుధవారం జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించగా.. 60 మంది గాయపడిన సంగతి తెలిసిందే. పది రోజుల ముందు కూడా అగ్ని ప్రమాదం జరిగిన విషయం విధితమే. వరుస ప్రమాదాలతో భక్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.