Monday, November 17, 2025
Homeనేషనల్Mumbai: ఆ 5 రాష్ట్రాలు మోడీని గద్దె దించటం ఖాయం

Mumbai: ఆ 5 రాష్ట్రాలు మోడీని గద్దె దించటం ఖాయం

వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, కర్నాటక, బిహార్, ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాలు కలిసి మోడీని గద్దె దించుతాయని జోస్యం చెప్పారు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్.  దేశ రాజకీయాల్లో పెనుమార్పు తెచ్చేలా ఈ ఐదు రాష్ట్రాలు కీలకంగా వ్యవహరించనున్నాయంటూ సంజయ్ విశ్లేషించారు. చైనా దుందుడుకు చర్యలపై మౌనం వహించిన కేంద్రం చేష్టలపై ఆయన భగ్గుమన్నారు.  వచ్చే ఏడాది జరుగనున్న లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వం మారటం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్ర మోడి, యూనియన్ హోం మినిస్టర్ అమిత్ షా, డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ చైనాపై నోరు మెదకపోవటంపై ఆయన ఆరోపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad