Wednesday, June 4, 2025
Homeనేషనల్Covid: దేశంలో మళ్లీ కరోనా టెన్షన్.. రెండు కొత్త వేరియంట్లు గుర్తింపు..!

Covid: దేశంలో మళ్లీ కరోనా టెన్షన్.. రెండు కొత్త వేరియంట్లు గుర్తింపు..!

దేశంలో మళ్లీ కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన నెలకొంది. కొత్తగా నమోదవుతున్న కేసులతో పాటు, తాజాగా గుర్తించబడిన రెండు కొత్త వేరియంట్లు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) వెల్లడించిన వివరాల ప్రకారం.. NB.1.8.1, LF.7 అనే రెండు సబ్ వేరియంట్లు భారత్‌లో తొలిసారి గుర్తించారు.

- Advertisement -

ఏప్రిల్‌లో తమిళనాడులో NB.1.8.1 వేరియంట్‌కు సంబంధించిన ఒక కేసు నమోదవగా, మే నెలలో నాలుగు LF.7 కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ రెండు వేరియంట్లను వేరియంట్స్ అండర్ మానిటరింగ్ (VUM) గా వర్గీకరించింది. చైనా, ఇతర ఆసియన్ దేశాల్లో కరోనా కేసుల పెరుగుదలకు ఈ వేరియంట్లు ప్రభావితం చేస్తున్నట్లు చెబుతోంది.

ఇటీవల కాలంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో మే నెలలో 278 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, మహారాష్ట్రలోనూ గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు కోవిడ్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా మృతి చెందారు. అదేవిధంగా 9 నెలల శిశువుకూ కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. శిశువుకు ప్రస్తుతం వైద్య చికిత్స అందిస్తున్నారు.

మహారాష్ట్రలో కూడా పరిస్థితి కాస్త తీవ్రంగా మారుతోంది. శనివారం 47 కొత్త కేసులు, ఆదివారం 45 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 209కి పెరిగింది. థానేలో డయాబెటిక్ కీటోయాసిడోసిస్‌తో బాధపడుతున్న 21 ఏళ్ల యువకుడు కోవిడ్‌తో మృతిచెందాడు. ఇది రాష్ట్రంలో నాల్గవ కోవిడ్ మృతి.

కోవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శనివారం కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో డిహెచ్ఆర్, ఐసిఎంఆర్, డిజిహెచ్‌ఎస్, ఎన్‌సిడిసి వంటి ప్రముఖ ఆరోగ్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుతం కేసుల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, అధికారులు పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన చోట మాస్క్‌లు ధరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News